Discount on Gold: యుద్ధం ఎఫెక్ట్.. భారీ డిస్కౌంట్పై బంగారం అమ్ముతున్న వ్యాపారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Discount on Gold: ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. అయితే, ఇది ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో దిగుమతి-ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ పరిస్థితుల ప్రభావం బంగారం వ్యాపారంపై కూడా పడింది. ప్రస్తుతం అనేక బంగారు షిప్మెంట్లు దుబాయ్లో నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. United Arab Emirates వైమానిక ప్రాంతం కొంతకాలం మూసివేయబడటం వల్ల బంగారం రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో అనేక ఎగుమతిదారులు తమ బంగారం సరుకులను సమయానికి పంపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రవాణాలో జాప్యం కారణంగా నిల్వ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన స్టాక్ను త్వరగా క్లియర్ చేయడానికి దుబాయ్ వ్యాపారులు బంగారాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం ప్రకారం, లండన్ బెంచ్మార్క్ ధర కంటే ఔన్సుకు సుమారు 30 డాలర్లు తక్కువగా బంగారం అమ్ముతున్నారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం 10 గ్రాములకు దాదాపు రూ.900 వరకు తగ్గింపుగా భావించవచ్చు. కాగా, ప్రపంచ బంగారం వ్యాపారంలో దుబాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆసియా దేశాలకు బంగారం సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఇది నిలిచింది. ముఖ్యంగా Switzerland, United Kingdom మరియు కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం ఇక్కడి నుంచి మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఇరాన్కు సంబంధించిన భద్రతా పరిస్థితులు మరియు గగనతల పరిమితులు ఈ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
Also Read
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
ఇక, భారత్ విషయానికి వస్తే, దుబాయ్ నుంచి బంగారం దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలలో భారత్ ఒకటి. అయితే ప్రస్తుతం దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున తక్షణ ప్రభావం కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.62 లక్షల వద్ద ఉండగా, ఒక కిలో వెండి ధర రూ.2.68 లక్షలకుపైగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. అయితే డాలర్ బలపడటం మరియు యుద్ధ పరిస్థితుల వల్ల మార్కెట్లో కొంత అస్థిరత కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!