CM Chandrababu: గ్లోబల్ లీడర్లుగా భారతీయులు.. త్వరలోనే రివర్స్ మైగ్రేషన్..
- భారతీయులు.. ప్రపంచంలో గ్లోబల్ లీడర్లు
- రివర్స్ మైగ్రేషన్.. నిపుణులు తిరిగి ఇండియాకు
- గ్రీన్ ఎనర్జీ & డేటా సెంటర్ హబ్ అభివృద్ధి
- జనాభా నిర్వహణ & యువతకు అవకాశాలు : సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ గమనంలో భారతీయుల పాత్ర, నాలెడ్జ్ ఎకానమీలో దేశం సాధించబోతున్న ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఐటీ రంగం నుండి గ్రీన్ ఎనర్జీ వరకు, జనాభా విధానం నుండి ఏఐ (AI) వరకు భవిష్యత్ భారత్ ఎలా ఉండబోతోందో తన విజన్ను పంచుకున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ డిప్లొమాట్లు భారతీయులేనని చంద్రబాబు కొనియాడారు. ఎక్కడికి వెళ్లినా స్థానిక సంస్కృతులతో కలిసిపోవడంలో భారతీయులకు మించిన వారు లేరన్నారు. గతంలో మన నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు వెళ్లడం ‘మేధో వలస’గా భావించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఆయన విశ్లేషించారు. నిపుణులు, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే రోజులు వచ్చాయని, త్వరలోనే ‘రివర్స్ మైగ్రేషన్’ (తిరుగు వలస) ప్రారంభమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
Also Read
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
నవ్యాంధ్రను డేటా సెంటర్ల హబ్గా మార్చేందుకు గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ సాధిస్తోందని, భవిష్యత్తులో దేశం విద్యుత్తును ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఏఐ (AI) , క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్ రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా ఇటీవల శిక్షణ కోసం పిలుపునిస్తే 50 వేల మంది యువత రిజిస్టర్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
దేశం ఎదుర్కోబోతున్న ‘ఏజింగ్’ (వృద్ధాప్య జనాభా) సమస్యపై చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను, ఇప్పుడు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించి ‘జనాభా నిర్వహణ’ (Population Management) గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఏపీలో ఫెర్టిలిటీ రేటును 1.5 నుండి 2.1కు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు:
మూడో బిడ్డ పుడితే రూ. 25 వేల ఆర్థిక సాయంతో పాటు, ప్రతి నెలా రూ. 1,000 అందించాలని నిర్ణయించాం. తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా చైల్డ్ కేర్ లీవ్ వంటి సౌకర్యాలపై ఆలోచన చేస్తున్నాం. గతంలో భారతదేశంలో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దేశానికి పెద్ద ఆస్తి అని, ప్రస్తుతం మైక్రో ఫ్యామిలీల వల్ల వస్తున్న మార్పులపై ప్రజల దృక్పథం మారాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!