ఢిల్లీలో మరోసారి టెన్షన్ నెలకొంది. మరోసారి నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపాలిటీల అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతపై సీపీఐ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. అయితే ఈ పిల్ పై సుప్రీం ఆగ్రహం…
ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీలో ప్రారంభోపన్యాసం చేసిన ఆమె.. చాలా స్పష్టంగా నాయకులకు ఇలా దిశానిర్దేశం చేశారు. మనలో ప్రతిఒక్కరి జీవితాలకు పార్టీయే ప్రధాన కేంద్ర బిందువు, ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంగా, క్రమశిక్షణతో, నిలకడగా, సమిష్టి బాధ్యత అనే స్పృహతో దృఢతరమైన పట్టుదల, దీక్షను ప్రదర్శించాలే తప్ప, ఇతరత్రా వేరే మంత్ర దండాలు ఏమీ లేవని స్పష్టం చేశారు…
ఢిల్లీలో జరుగుతున్న న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధులు గుర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు.…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్గ్రేడ్ చేయనుంది సర్కార్.. దీంతో, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం కూడా సులభం అవుతుందని…
మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. థర్డ్ వేవ్ తర్వాత వందల్లోకి పడిపోయిన రోజువారి పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. వెయ్యిని దాటేసి.. రెండు వేలను కూడా క్రాస్ చేసి.. మూడు వేల వైపు పరుగులు పెడుతున్నాయి.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ తీవ్రత ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ 1,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు.. ఇక, దేశవ్యాప్తంగా సోమవారం 2,541 మందికి పాజిటివ్గా తేలింది.. 30 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.…
మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కీరణ్ బేడీకి ఓ ఆశ్రమ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ హైకోర్టు.. రోహిణిలోని బాబా వీరేంద్ర దీక్షిత్ ఆధ్యాత్మిక ఆశ్రమం బాధ్యతలను ఆమెకు అప్పగించింది.. ఆ ఆశ్రమంలో ఉన్న మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. ఆ కమిటీకి కిరణ్ బేడీ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రోహిణీ జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ మహిళా నేర విభాగం డీసీపీ, ఢిల్లీ మహిళా కమిషన్, జిల్లా న్యాయ…
అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత…
భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. వందల్లోకి వచ్చాయి.. అయితే, ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెట్టే విధంగా వేలలోకి వెళ్తున్నాయి.. కరోనా కేసులు పెరుగుతుండటంతో… మరోసారి ఆంక్షల వైపు ఢిల్లీలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోజు వారి కేసులు సంఖ్య రెట్టింపవుతోంది. వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా లేక పోయినప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవు. మాస్కుల వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ…
పెట్రో ధరల పెరుగుదల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆ ధరల జోలికి పోలేదు.. ఇక, ఫలితాలు వెలువడిన తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా వడ్డించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు ఆల్టైం హై రికార్డును సృష్టించాయి. దీంతో, ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇవాళ, రేపు బంద్ పాటిస్తున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ రెండు…
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను…