Bandi Sanjay: బండి సంజయ్ నారాజ్..! ఢిల్లీ పెద్దల వద్ద ఆవేదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కొత్త జోష్ నింపారని చెబుతారు.. ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించిన తర్వాత తెలంగాణలోని లీడర్లలో, క్యాడర్లో ఉత్సాహం నింపారని.. దూకుడుగా కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తూ.. అధిష్టానం నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.. ఆ మధ్య తుక్కుగూడ దగ్గర నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. బండిపై ప్రశంసలు కురిపించారు.. బండి సంజయ్ మాటలు వింటుంటే.. కేసీఆర్ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరంలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో, బండిపై ఆయనకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే, తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
Read Also: Traffic Rules: మంత్రి, ఎమ్మెల్యే అయితే మాకేంటి..? రూల్ రూలే..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారట బండి సంజయ్.. పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే తనపై వ్యక్తిగత దాడికి పార్టీ నేతలే సహకరిస్తున్నారని బండి సంజయ్ నారాజ్ లో ఉన్నారని సమాచారం.. పార్టీలో జరుగుతోన్న కీలక పరిణామాలపై లీక్లు, సోషల్ మీడియాలో ప్రచారాలపై ఢిల్లీ నాయకుల వద్ద ప్రస్తావించారట తెలంగాణ బీజేపీ చీఫ్.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దల వద్ద ఏ కరువు పెట్టిన ఆయన.. పార్టీలో చేరికలపై జరగుతున్న ప్రచారం, చేరికల అడ్డగింతపై కూడా ఢిల్లీ నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. కాగా, బండి సంజయ్పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు విడిగా సమావేశాలు కావడం అప్పట్లో హాట్ టిపిక్గా మారిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ పెంచారు.. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో తన ఆవేదనను ఢిల్లీ పెద్దల దగ్గర బండి సంజయ్ వెలిబుచ్చడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!