సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
తనకు క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని.. తాను ఆయన వీరాభిమానినని తెలిపింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం.. పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు.
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఓ హోటల్లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.
నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.