కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్హౌజ్లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు…
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్…
ఉత్తరాది రాష్ట్రాల్లో తన పర్యటనను మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తుతోన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని.. అసలు ఆయన్ను భరించే శక్తి వారికి లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. ఆ భయంతోనే ఢిల్లీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని, కేసీఆర్ హైదరాబాద్కు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు.…
2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి…
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో పాటు తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ బీజేపీ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్…
ఖమ్మం జిల్లా కేంద్రం ఇప్పుడు రాజకీయ వైరానికి కేంద్రంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం తార స్థాయికి చేరింది. అయితే పోలీసులు ఒక్క పక్షానికే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిరసనలకు దారి తీస్తున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షంకు చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేస్తే లేని అభ్యంతరాలు బీజేపీ మాత్రం అధికార పార్టీకి చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేయనీయకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల వైఖరితో వైరం ఇంకా…
సూటిగా సుత్తి లేకుండా కామెంట్ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు నిజామాబాద్లో పొలిటికల్ గేర్ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్లో పర్యటించినా.. ఎంపీ అరవింద్పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా…
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఎప్పుడో ఖాయమైంది. కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో దారి మళ్లించేందుకు ప్రగతి భవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రాహుల్ గాంధీ చదువుతున్నాడని అన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే… రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టాడని కొనియాడారు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే టీఆర్ఎస్ తో పొత్తు లేదని రాహుల్ గాంధీ చెబుతున్నాడని బండి సంజయ్…