Police Partiality: దిష్టిబొమ్మల దహనం కేసులపై పోలీసుల వివక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా కేంద్రం ఇప్పుడు రాజకీయ వైరానికి కేంద్రంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం తార స్థాయికి చేరింది. అయితే పోలీసులు ఒక్క పక్షానికే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిరసనలకు దారి తీస్తున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షంకు చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేస్తే లేని అభ్యంతరాలు బీజేపీ మాత్రం అధికార పార్టీకి చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేయనీయకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల వైఖరితో వైరం ఇంకా పెరుగుతుంది.
గత కొంత కాలంగా ఖమ్మం నగరంలో టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ ల మధ్య వైరం పెరిగింది. గత నెలలో సాయి గణేష్ అనే బీజేపీ యువ నాయకుడు ఆత్మహత్య వ్యవహారం నుంచి ఆ రెండు పార్టీల మధ్య వివాదాలు బాగా పెరిగాయి. బీజేపీ నేతల మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే కేసులను తట్టుకోలేక సాయి ఆత్మహత్య చేసుకోగా, అది తీవ్ర వివాదంగా మారింది. మంత్రి అజయ్ కుమార్ వర్సెస్ బీజేపీగా మారింది. నెల రోజుల నుంచి రెండు పార్టీల మధ్య ప్రెస్ మీట్ లు, ఆందోళనలు సాగుతున్నాయి.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
తాజాగా జరిగిన వివాదంలో కూడా పోలీసులు ఒక్కవైపే ఉండడంతో అది ముదిరి పోయింది. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నసాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియా సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. విమర్శలు చేశారు. అయితే బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ గా నిన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. నడి రోడ్డు మీద, ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ నీరజ లు పాల్గొన్నారు. సంజయ్ మీద కామెంట్లు కూడా చేశారు. అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ దానిని అడ్డుకోవడం కాని మరే చర్య పోలీసులు తీసుకోలేదు..
ఇకపోతే తమ పార్టీ నేత, రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను అధికార పార్టీ వారు దగ్దం చేయడాన్ని బీజేపీ శ్రేణులు తప్పు పట్టాయి. దీనికి నిరసనగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్దం ను అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. అయితే దిష్టి బొమ్మ దగ్దం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందే అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్త ఉపేందర్ పెట్రోల్ తన మీద పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు నీళ్లు పోసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదే సందర్బంలో దిష్టి బొమ్మను దగ్దం చేయడానికి ప్రయత్నించగా మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్బంగా భారీ తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
నగరంలో పోలీసులు ఒక్క పక్షానికే మద్దతు పలుకుతున్నారని అధికార పార్టీ నాయకులు ఏం చేసినప్పటికి పట్టించుకోరన్న విమర్శ ఉంది. అదే ప్రతిపక్ష నాయకులు, క్యాడర్ చిన్న ఆందోళనలు చేసినప్పటికీ కేసులు పెట్టడం ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆందోళనకు ఒక్క మాదిరిగా, ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలకు మరో విధంగా చేస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. మొత్తం మీద గత కొంత కాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ల మధ్య వివాదాలు తీవ్రంగా మారాయి. పోలీసులు మాత్రం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూట కట్టుకోవలసి వస్తోంది.
Project K: ప్రభాస్ ఎంట్రీ సీన్.. ప్రాణం పెట్టి తీస్తున్నామన్న డైరెక్టర్
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!