బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని, మతాన్ని కలిపి రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపించారని… ఇదంతా ఓట్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు. 9.8 రిజర్వేషన్ కోసం ఈనెల మండల కేంద్రాల్లో ఆందోళన చేపడుతామని వెల్లడించారు. పోడు వ్యవసయా చేసుకుంటున్న వారిని కూడా సీఎం మోసం చేస్తున్నారని సోయం బాపురావు విమర్శించారు.
ఇటీవల ఈ రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తోంది. గిరిజనులు, ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసిన బిల్లును కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు.