Bandi Sanjay: సర్పంచులతో కలిసి సమరభేరీ.. మౌన దీక్షకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్హౌజ్లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బండి సంజయ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
‘పల్లె ప్రగతి’ పేరుతో గత నాలుగు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనులన్నీ సర్పంచులు చేసినా.. వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో గ్రామ పంచాయతీలన్నీ దివాళా తీశాయి. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. బిల్లులు రాకపోవడంతో సర్పంచులంతా అప్పులపాలయ్యారు. ఈ అప్పుల్ని భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకోలేక, మరికొందరు ఆస్తులు అమ్ముకొని బతుకుదెరువు కోసం కూలీలుగా మారారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్న బీజేపీ.. భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తొలుత దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధం కావాలని ప్రణాళికలు చేపడుతున్నారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
కేంద్ర ప్రభుత్వ లక్షల కోట్ల నిధులు ఇస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పంచాయతీలకు నిధులిస్తున్నట్లు ఉత్తర్వులిస్తూనే.. మరోవైపు ఆ నిధులను ఫ్రీజ్ చేస్తూ సర్పంచులను మానసిక క్షోభకు గురిచేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!