ఆ ఎమ్మెల్సీ డిసైడ్ అయ్యింది ఏంటి..? అస్త్రంగా మార్చుకుందేంటి..? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూటిగా సుత్తి లేకుండా కామెంట్ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు నిజామాబాద్లో పొలిటికల్ గేర్ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్లో పర్యటించినా.. ఎంపీ అరవింద్పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో ఉన్న అనుమానం ఒక్కటే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారా? అందుకే పొలిటికల్ వాతావరణాన్ని గేరప్ చేస్తున్నారా? అనే చర్చ హీటెక్కుతోంది.
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్.. తాను ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొస్తానని రైతులకు బాండ్ పేపరు రాసిచ్చారు. అరవింద్ ఎంపీగా గెలిచి మూడేళ్లు పూర్తయినా.. పసుపు బోర్డు ఊసే లేదు. పైగా పసుపు బోర్డుకు మించి అంటూ.. స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అది స్థానిక రైతులకు కనెక్ట్ కాలేదు. తమకు పసుపు బోర్డు మినహా ప్రత్యామ్నాయం ఏదీ అక్కర్లేదని తెగేసి చెబుతున్నారు రైతులు. పోరాటం ఆపలేదు కూడా. నిజామాబాద్ లోక్సభ పరిధిలో పర్యటనకు వచ్చే ఎంపీ అరవింద్ను రైతులు అడ్డుకుంటున్న ఉదంతాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 178 రైతులు పోటీ చేసి.. పసుపు బోర్డు డిమాండ్ సెగ ఢిల్లీకి తాకేలా చేశారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ డిమాండ్ ఎగిసిపడుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేయడం చర్చగా మారింది.
Also Read
ఎంపీ అరవింద్పై అటాకింగ్ విషయంలో ఎమ్మెల్సీ కవిత పక్కా ప్లానింగ్తోనే అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు సేకరించి మరీ చాకిరేవు పెట్టేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏం చేసింది చెబుతూనే.. ఈ మూడేళ్లలో అరవింద్ సాధించింది ఇదీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవిత. మీడియా ఎదుటే కాకుండా.. నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాల్లోనూ బీజేపీ ఎంపీని విడిచి పెట్టలేదు. బాండ్ పేపరుపై హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు తీసుకురావాలని.. లేకపోతే ఎంపీని ప్రతి గ్రామంలోనూ నిలదీస్తామని హెచ్చరించారు కవిత.
బీజేపీ ఎంపీని ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టుండి గట్టిగా టార్గెట్ చేయడానికి వెనక కారణాలను విశ్లేషించే పనిలో పడ్డాయి పార్టీలు. ఓడిన చోటే గెలవాలని డిసైడై.. పసుపుబోర్డు అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా బరిలో దిగుతారని.. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారని చెవులు కొరుక్కుంటున్నాయి గులాబీ శ్రేణులు. వచ్చే రెండేళ్లూ ఇందూరులో పసుపు యుద్ధం తప్పదని లెక్కలేస్తున్నారట. అప్పుడు పసుపు ఓడిస్తే.. ఇప్పుడు అదే పసుపు గెలిపిస్తుందనే లెక్కల్లో ఉన్నారట. మరి.. పసుపు అస్త్రం వచ్చే ఎన్నికలను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..