మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ వాయిదా పడింది.. అయితే, ఈ రోజు కీలక వాదనలు జరిగాయి.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. అసలు రాజకీయ కక్షతో రజినిపై కేసు నమోదు చేశారని హైకోర్టులో వాదనలు వినిపించారు రజిని తరఫు న్యాయవాది..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూడు 'సీ'లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు 'సీ'లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు.. అయితే, సీఐడీ నోటీసులను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వర్మ.. ఇక, సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ రాంగోపాల్ వర్మ వేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా... నంబర్ టూ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో... అలాగా.... అని అంతా అనుకుంటున్న టైంలోనే... కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన సాయిరెడ్డి...
అనకాపల్లి జిల్లా... యలమంచిలి సెగ్మెంట్లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా వున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారాయన. దాంతో ఇప్పుడు ఆలూరు మీద పట్టు తగ్గుతోందని అంటున్నారు. జయరాం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సోదరులతోపాటు కజిన్ గుమ్మనూరు నారాయణ స్థానికంగా వ్యవహారాలు నడిపించేవారు. ఇంకా చెప్పాలంటే...అందరికంటే ఎక్కువగా నారాయణే కథ…
ఒకప్పుడు నెత్తుటేళ్ళు పారిన అనంతపురం జిల్లాలో మళ్లీ రక్త చరిత్ర టాపిక్ తెర మీదికి వచ్చింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం లో జరిగిన ఒక హత్య దగ్గర మొదలైన మేటర్... ఫ్లాష్ బ్యాక్లో పరిటాల రవి మర్డర్ వరకు వెళ్తోంది. ఆ పాత గాయాలు మళ్లీ ఎందుకు రేగుతున్నాయి?
మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నారా లోకేష్ అవకాశం వచ్చినప్పుడల్లా స్థాయిని మించి మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. కళ్లు నెత్తి మీదకి ఎక్కి... వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో.. 2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది.. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లే ఔట్ కు కేటాయించిన 15.17 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కేవలం ఫిలిం స్టూడియో, అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 336లో మొత్తం 34.44 ఎకరాల భూమిని కేటాయించింది.