Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
- ఎండల దృష్ట్యా హాఫ్-డే స్కూల్స్ నిర్ణయం
- ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు
- టెన్త్ ఎగ్జామ్ సెంటర్లకు ప్రత్యేక టైమింగ్స్
- ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలలకు వచ్చే నెల మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు (Half-Day Schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం వడ్డించి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.
Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
అయితే, పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల పని వేళల్లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. బోర్డు పరీక్షలు ఉదయం పూట జరుగుతున్నందున, అటువంటి పాఠశాలల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులు (Special Classes) పరీక్షల సమయం వరకు యధావిధిగా కొనసాగుతాయి. మరోవైపు, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలు , డైట్ కళాశాలలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఇవి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పనిచేస్తాయి. ఈ సమయంలో తగ్గిన పని గంటలను భర్తీ చేసేందుకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహించనున్నారు.
వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పనిదినం ఏప్రిల్ 23 కాగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు అమలులో ఉంటాయి. తిరిగి కొత్త విద్యా సంవత్సరం (2026-27) జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎండల తీవ్రత నుంచి విద్యార్థులను రక్షించేందుకు విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని అధికారులు సూచించారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!