Ibrahimpatnam Drama: గెలిచినా దక్కని చైర్మన్ పదవి.! హైకోర్టు స్టేతో నిలిచిన ఇబ్రహీంపట్నం ఎన్నికల ఫలితం.!
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వివాదంపై రేపు హైకోర్టులో విచారణ
- రేపు ఉదయం 10.30 గంటలకు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బెంచ్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశం
- న్యాయవాది రామకృష్ణారెడ్డిని అమికస్ క్యూరీగా నియమించిన హైకోర్టు
- ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు
- మరో లంచ్ మోషన్ పిటిషన్లో రేపు హైకోర్టులో జరగనున్న విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు హైకోర్టు మెట్లెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ ఎన్నికపై కీలకమైన స్టే విధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం దీనిపై తుది విచారణ జరగనుంది. ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడం. ఆయనను ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా ఓటింగ్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కుమారుడు హరికృష్ణ దాఖలు చేసిన ‘హేబియస్ కార్పస్’ పిటిషన్పై ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, రేపు ఉదయం 10:30 గంటలకు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని స్వయంగా తమ బెంచ్ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో న్యాయస్థానానికి సాంకేతిక , చట్టపరమైన సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయి, చైర్మన్ అభ్యర్థిగా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికైనట్లు ప్రచారం జరుగుతున్న సమయంలోనే కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేయకుండా నిలిపివేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ , కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని హైటెన్షన్ నెలకొంది.
ప్రస్తుతానికి ఈ ఎన్నిక భవితవ్యం రేపు ఉదయం జరగబోయే విచారణపైనే ఆధారపడి ఉంది. మరో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా దాఖలైన ఈ కేసులో కౌన్సిలర్ యాదగిరి స్వయంగా కోర్టుకు హాజరై ఇచ్చే స్టేట్మెంట్ అత్యంత కీలకం కానుంది. ఆయన తన ఇష్టపూర్వకంగానే వెళ్లారా లేదా ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న అంశంపై స్పష్టత వస్తేనే ఈ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడనుంది. పోలీసులు ఇప్పటికే కౌన్సిలర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రేపటి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Bhupen Borah: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్..
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..