Breaking News: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు 6 నెలల జైలు శిక్ష.! హైకోర్టు సంచలన తీర్పు.!
- కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్కు జైలు శిక్ష
- భూ వివాదం తీర్పు అమలు చేయకపోవడంపై ఆగ్రహం
- ₹2,000 జరిమానాతో పాటు ఆరు నెలల శిక్ష
- డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గానూ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, భూహక్కులకు సంబంధించి గతంలో ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ, వివాదంలో ఉన్న ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించింది. అయితే, న్యాయస్థానం నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం వ్యవస్థను అవమానించడమేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారులు చట్టానికి , న్యాయస్థానాలకు లోబడి పనిచేయాలని, ఆదేశాలను బేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. ఒక ఐఏఎస్ అధికారికి ఈ స్థాయిలో శిక్ష పడటంతో, ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేసే అవకాశం ఉంది.
Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!