Bhatti Vikramarka: కక్ష పూరితంగానే తప్పుడు కేసులు పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka Fires on BJP Over ED Investigation: మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తాజాగా ఎమ్మల్యే భట్టి విక్రమార్క బీజేపీపై విరుచుకుపడ్డారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతోందని ఆగ్రహించారు. వేధించడంలో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేయిస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని విషయాల్లో విచారణకు పిలవడమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
Jeevan Reddy: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది
Also Read
ఈడీ, సీబీఐలను వినియోగించి.. ప్రతిపక్షాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని, ఇందుకు నిరసనగానే ఆందోళన చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పేపర్పైనే కాంగ్రెస్కి ఈడీ విచారణ బీజేపీ అంటోందని, భయబ్రాంతులకు గురి చేయాలనే ఈ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సభ జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో సభ్యుల్ని ఈడీ విచారణకు పిలిపించిందని.. ఇవాళ సోనియాగాంధీని, రేపు ప్రతిపక్ష సభ్యులకు ఈడీ నోటీసులు రావడం తథ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలన మత ఘర్షణల్ని పెంచేలా జరుగుతోందని, బీజేపీ కుట్రల్ని గమనించండంటూ ప్రతిపక్షాలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈడీతో భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!