Jeevan Reddy: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. అందులో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని జీవన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసినప్పటికీ.. తెలంగాణ ఏర్పాటుకు సోనియా రాజకీయ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే విధంగా ఆహారభద్రత చట్టాన్నీ తెచ్చారని, అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ తీసుకొచ్చారని అన్నారు. దేశం మొత్తానికి ప్రధాన బాధ్యత తెలంగాణపైనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఆ మహాతల్లికి ఈ రాష్ట్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈడీ విచారణ పూర్తయ్యేంతవరకూ వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూనే ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
- Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని ఈడీ గురువారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించినా, కరోనా బారిన పడడంతో సోనియా హాజరు కాలేదు. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహాళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
-
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
-
Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!