Jeevan Reddy: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. అందులో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని జీవన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసినప్పటికీ.. తెలంగాణ ఏర్పాటుకు సోనియా రాజకీయ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే విధంగా ఆహారభద్రత చట్టాన్నీ తెచ్చారని, అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ తీసుకొచ్చారని అన్నారు. దేశం మొత్తానికి ప్రధాన బాధ్యత తెలంగాణపైనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఆ మహాతల్లికి ఈ రాష్ట్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈడీ విచారణ పూర్తయ్యేంతవరకూ వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూనే ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
- GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని ఈడీ గురువారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించినా, కరోనా బారిన పడడంతో సోనియా హాజరు కాలేదు. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహాళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!