Jeevan Reddy: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది
MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. అందులో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని జీవన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసినప్పటికీ.. తెలంగాణ ఏర్పాటుకు సోనియా రాజకీయ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే విధంగా ఆహారభద్రత చట్టాన్నీ తెచ్చారని, అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ తీసుకొచ్చారని అన్నారు. దేశం మొత్తానికి ప్రధాన బాధ్యత తెలంగాణపైనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఆ మహాతల్లికి ఈ రాష్ట్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈడీ విచారణ పూర్తయ్యేంతవరకూ వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూనే ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని ఈడీ గురువారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించినా, కరోనా బారిన పడడంతో సోనియా హాజరు కాలేదు. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహాళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!