MP Soyam Bapurao: ఆ దాడులు చేయించింది తెలంగాణ ప్రభుత్వమే
MP Soyam Bapurao Fires On Attack On Tribal Farmers: పోడు భూముల సమస్యని సాకుగా చూపి.. అటవీ అధికారులు, పోలీసుల చేత ఆదివాసులపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేయించిందని ఎంపీ సోయం బాపురావ్ ఆరోపించారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి.. బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సోయం బాపురావ్.. ఛైర్మన్ జస్టిస్ ఏకే మిశ్రా, సెక్రటరీ జనరల్ దేవేందర్ కుమార్ సింగ్లను కలిశారు. తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యకు ఇంతవరకూ పరిష్కారం లభించలేదని.. ఆ భూముల్ని అటవీ అధికారులు బలవంతంగా లాక్కొని, ఆదివాసీ గుడేల నుండి అడవి బిడ్డలను తరలించేందుకు కుట్ర జరుగుతోందని వారికి ఫిర్యాదు చేశారు.
ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడ గ్రామంలో అడవి బిడ్డలపై ఫారెస్ట్ పోలీస్ అధికారులు దాడులు చేసి, వారిని తీవ్రంగా గాయపరిచారని సోయం బాపురావ్ చెప్పారు. అంతేకాదు.. వారిపై అక్రమ కేసులు కూడా బనాయించారని వివరించారు. అలాగే.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ పాత జిల్లాల పరిధిలోని ఏజెన్సీ భూముల్లో ఆదివాసులకు పట్టా ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు నిర్బంధ చర్యలు సాగిస్తున్నారని వెల్లడించారు. కోయపోషగూడలో 12 మంది మహిళలను జైలుకు పంపి, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన జస్టిస్ కే మిశ్రా.. అమానుషంగా దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని మానవ హక్కుల కమిషన్ తమకు హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు వివరించారు.
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!