తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో…
వల్లభనేని వంశీకి షాక్.. మరో కేసు నమోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని…
నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ.. తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమబాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే జనం నుంచి కోటికిపైగా సంతకాల సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్కి సమర్పించి పీపీపీ మోడల్ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్కు కోటి…
* అమరావతి: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష.. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం.. జిల్లాల వారీగా పరిస్థితికి సంబంధించి సమీక్ష.. సాయంత్రం కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ.. అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ ప్రత్యేక సమీక్ష.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నియంత్రణ… ఇతర అంశాలపై చర్చ * అమరావతి: నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్తో వైఎస్ జగన్ భేటీ.. కోటి సంతకాల ప్రతులను…
తెలంగాణలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కమ్లకు ప్రత్యామ్నాయంగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మూడో డిస్కమ్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణకు హాజరవని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి? లిస్ట్లో మొత్తం పది మంది ఉంటే… 8మందిని విచారించి ఐదుగురి విషయంలోనే తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆ ముగ్గురి విషయంలో తీర్పు ఎప్పుడు? ప్రస్తుతం బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వరుసగా జడ్జిమెంట్ ఇస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది విచారణ ముగియగా… ఐదుగురి విషయంలో…
ఐడీపీఎల్ భూముల ఆక్రమణదారులు ఎవరు? ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణల్లో ఏది నిజం? తేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆబగా ఆక్రమించుకుందామనుకున్నది ఎవరు? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? దొంగ ఎవరో, దొర ఎవరో తేలిపోతుందా? Also Read:Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే.. మూతపడ్డ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో పొగలు పుట్టిస్తోంది. హైదరాబాద్…
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని,…