వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాల పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు…
KNRUHS: వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం…
సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ యార్డు తెరుచుకోవండతో.. తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా తెల్ల బంగారం భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సుమారు 5,000 బస్తాల మిర్చి…
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెటర్నరీ డాక్టర్ వీడియో కాల్ లో చెప్పిన సూచనలను పాటిస్తూ గోమాతకు ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కేఎంసీ వైద్య విద్యార్థులు. కాగా, ప్రసవం తర్వాత ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోపాలమిత్ర సభ్యులు పేర్కొన్నారు.
Warangal: వరంగల్ జిల్లాలో రవాణాశాఖలోని ఆర్టీఓ గంధం లక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, ఆర్టీఓ గంధం లక్ష్మితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సమయంలో రవాణా శాఖ…
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Uppal Fly Over: హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం…