Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య..
- వరంగల్ జిల్లాలో దారుణం..
- నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Read also: AP Rains: మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
వరంగల్ నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటుంది. ఏకశిలా గర్ల్స్ హాస్టల్ లోనే శ్రీదేవి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీదేవి ఎంత సేపటికి గది తలుపులు తెరవక పోవడంతో రూమ్మేట్స్ ఏకశిలా గర్ల్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం గది తలుపులు తెరిచి చూడగా శ్రీదేవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే శ్రీదేవిని కిందికి దించగా అప్పటికే మృతిచెందింది. దీంతో యాజమాన్యం శ్రీదేవి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే శ్రీదేవి మృతి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో హాస్టల్ వద్దకు వచ్చి యజమాన్యానికి నిలదీశారు.
Read also: IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్ శర్మ
దీంతో యాజమాన్యం పొంతలేని సమాధానం చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. యాజమాన్యానికి పోలీసులు ప్రశ్నించగా అనారోగ్యమే కారణంగా శ్రీదేవి చనిపోయిందని తెలిపారు. దీంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా చనిపోతే తమ కూతురు ఉరి ఎందుకు వేసుకుందని? అసలు చనిపోయన సమాచారం కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. దీంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీదేవి మృతికి కారణం ఏకశిలా గర్ల్స్ హాస్టల్ సిబ్బందే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం లేకుండా మృత దేహాన్ని మార్చురీకి ఎందుకు తరలించారని, న్యాయం జరిగేంత వరకు ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద నుంచి కదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suriya : సూర్య కల్ట్ టైటిల్ రివీల్ చేసేందుకు టైం ఫిక్స్
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!