Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య..
- వరంగల్ జిల్లాలో దారుణం..
- నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య..
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Read also: AP Rains: మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
వరంగల్ నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటుంది. ఏకశిలా గర్ల్స్ హాస్టల్ లోనే శ్రీదేవి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీదేవి ఎంత సేపటికి గది తలుపులు తెరవక పోవడంతో రూమ్మేట్స్ ఏకశిలా గర్ల్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం గది తలుపులు తెరిచి చూడగా శ్రీదేవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే శ్రీదేవిని కిందికి దించగా అప్పటికే మృతిచెందింది. దీంతో యాజమాన్యం శ్రీదేవి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే శ్రీదేవి మృతి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో హాస్టల్ వద్దకు వచ్చి యజమాన్యానికి నిలదీశారు.
Read also: IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్ శర్మ
దీంతో యాజమాన్యం పొంతలేని సమాధానం చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. యాజమాన్యానికి పోలీసులు ప్రశ్నించగా అనారోగ్యమే కారణంగా శ్రీదేవి చనిపోయిందని తెలిపారు. దీంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా చనిపోతే తమ కూతురు ఉరి ఎందుకు వేసుకుందని? అసలు చనిపోయన సమాచారం కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. దీంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీదేవి మృతికి కారణం ఏకశిలా గర్ల్స్ హాస్టల్ సిబ్బందే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం లేకుండా మృత దేహాన్ని మార్చురీకి ఎందుకు తరలించారని, న్యాయం జరిగేంత వరకు ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద నుంచి కదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suriya : సూర్య కల్ట్ టైటిల్ రివీల్ చేసేందుకు టైం ఫిక్స్
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!