Konda Murali: నేను అవినీతి సొమ్ము తినే వ్యక్తిని కాదు: కొండా మురళి
- మిల్లు భూములు కార్మికుల కుటుంబాలకు చెందాల్సిందే
- పేదల పక్షాన పోరాటం చేస్తున్నా
- అజంజాహీ మిల్స్ స్థలం కోసం పోరాటం చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని, అవినీతి సొమ్ము తినే వ్యక్తిని అస్సలు కాదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. తన రాజకీయ జీవితం జీవితం మొత్తంలో పేదల కోసమె పోరాటం చేశాన్నారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తానని కొండా మురళి చెప్ప్పుకొచ్చారు. అజంజాహీ మిల్స్ యూనియన్ కార్యాలయ స్థలం కబ్జా ఆరోపణలపై కొండా మురళి స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ… ‘ఆజంజాహీ మిల్లు భూములు కార్మికుల కుటుంబాలకు చెందాల్సిందే. నా రాజకీయ జీవితం మొత్తం పేదల పక్షాన పోరాటం చేస్తున్నాను. నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అజంజాహీ మిల్లును కుడాకు ఇవ్వొద్దని కేటీఆర్కు చెప్పాను. అప్పటి ఎమ్మెల్యే, కుడా చైర్మన్ నన్ను విభేదించారు. అజంజాహీ మిల్స్ స్థలం కోసం పోరాటం చేశాను. నేను హైదరాబాద్లో ఉన్నపుడు నమశ్శివాయ నాకు ఫోన్ చేశాడు. వేల మందికి ఉపాధి ఇచ్చే షాపింగ్ మాల్ ప్రారంభానికి రావాలని చెప్పారు. చట్టపరంగా 1200 గజాల కొనుక్కున్నానని చెప్పాడు. కేటీఆర్, సంతోష్, కవితకు అప్పులిచ్చిన వ్యక్తి నమశ్శివాయ. అలాంటి వ్యక్తి నా దగ్గరకు వస్తే కాదనలేకపోయాను. అందుకే ఆ స్థలంలో షాపింగ్ మాల్ భూమి పూజకు హాజరయ్యాను’ అని తెలిపారు.
Also Read
‘నేను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదు. నమశ్శివాయ స్థలం కుడాకు చెందినది కాదు, ఏ సంస్థకు చెందినది కూడా కాదు. అయినప్పటికీ ఆ స్థలంలో ఎలాంటి పని చేయొద్దని చెప్పాను. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తాను. నేను అవినీతి సొమ్ము తినే వ్యక్తిని కాదు. అజంజాహి కార్మిక భవనం స్థలంపై కార్మికుల పక్షాన కొట్లాడిందే నేను. ఓం నమశ్శివాయ అనే వస్త్ర వ్యాపారి నా సహాయం కోరాడు. శత్రువుకు భయం పుట్టించేందుకే ఆ వ్యాపారితో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ నేనెప్పుడూ కార్మికుల పక్షమే. ఆ భూమిపై పూర్తి స్థాయిలో సర్వేచేయించి, కార్మికులకు ఫంక్షన్ హాల్ నిర్మిస్తాము. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే విమర్శలు చేస్తున్నారు. రికార్డుల్లో కార్మికుల పేర్లు లేవు. ఆ స్థలం 2015లోనే వస్త్ర వ్యాపారికి ముటేషన్ అయింది. అయినా వారికి సగం స్థలం ఇప్పిస్తాము. అజంజాహి మిల్ 11 గుంటలపై వివాదం చేస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలును ఎందుకు తరలించారు?. ఆ జైలులో ఉన్న విలువైన బండలు ఏమయ్యాయ్?’ అని కొండా మురళి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..