Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!
- జిల్లాలో ఎన్నికలనాటి జోష్ ఇప్పుడు లేదన్న టాక్..
- ఇన్ఛార్జ్లు కేడర్ని అస్సలు పట్టించుకోవడం లేదా?..
- చింతలపూడి, గోపాలపురంలో జనసేనకు బలమైన కేడర్..
- టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అసంతృప్తి..
- పార్టీ ఇన్ఛార్జ్లు కూడా వదిలేశారన్న అసహనం..
- కష్టంలో ఉన్న కార్యకర్తలకు అండ కరవు..
- గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ను మార్చాలన్న డిమాండ్..
- గ్రూప్వార్తో చింతలపూడి టీడీపీ సతమతం..
- మనం బలపడి ఈసారి సీటు అడుగుదామంటున్న గ్లాస్ కేడర్..
- నాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదంటూ కార్యకర్తల ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: 2024 ఎన్నికల్లో జనసేనకు వెన్నెముకగా నిలబడింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ఈ జిల్లా నుంచి గ్లాస్ గుర్తు మీద ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే… ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి వాళ్ళు వీళ్లు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. ఎమ్మెల్యేలు తమ పనులు చక్కబెట్టుకునే దిశలో ప్రయాణిస్తుంటే… ఇన్ఛార్జ్లు సొంత లాభాలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు సెగ్మెంట్స్ చింతలపూడి, గోపాలపురంలో జనసేనకు మంచిపట్టు ఉన్నప్పటికీ సరైన రీతిలో క్యాడర్ను నడిపించే నాయకత్వం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందట. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రిజర్వ్డ్ సెగ్మెంట్లలో జనసేన నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా ఒకరిద్దరు నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ మమ అనిపిస్తున్నారట మిత్రపక్షం ఎమ్మెల్యేలు. సరే… వాళ్ళని వదిలేసి మనం సొంతగా ఎదిగేందుకు విస్తృత అవకాశాలున్నా…. పార్టీ ఇన్ఛార్జ్లు ఆ సంగతే పట్టించుకోవడం లేదంటూ గుర్రుగా ఉంది కేడర్. ఏడాదిన్నర కాలంలో ఇక్కడి ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనితీరు చూపించలేకపోయారన్న అభిప్రాయం పెరుగుతున్నా…. దాన్ని ఉపయోగించుకుని మనం ఎక్కువగా జనంలోకి వెళ్ళలేకపోతున్నామంటూ ఈ నియోజకవర్గాల్లో జనసేన ద్వితీయ శ్రేణి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందో లేదోనన్న అనుమానంతో…. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఇన్ఛార్జ్ పదవిని అడ్డుపెట్టుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కష్టమొచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడే విషయంలో రిజర్వుడు సెగ్మెంట్స్ ఇన్చార్జ్లు పూర్తిగా విఫలమవుతున్నారన్నది జనసేన కేడర్ వాయిస్. పార్టీ కోసం కష్టపడి పని చేసే ఉద్దేశం ఉన్నా… పట్టించుకునే దిక్కు లేదన్నది వాళ్ళ అసంతృప్తి. గోపాలపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో పాటు జనసేన క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ ఇన్చార్జ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారట. పైగా పార్టీ కార్యక్రమాల పేరుతో చేపట్టిన సేవా కార్యక్రమాలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మైనస్ అయిందని అంటున్నారు. అందుకే గోపాలపురం జనసేనకు కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలన్న డిమాండ్ పెరుగుతోంది. గత ఎన్నికల్లో మన కోటాకింద సీటు రానంత మాత్రాన ఈసారి కూడా అలాగే జరుగుతుందన్న గ్యారంటీ ఏంటి? మనం గట్టిగా పనిచేసి బలం పుంజుకుంటే… ఈసారి సీటు ఇవ్వక ఎక్కడికి పోతారంటూ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది కేడర్. అటు చింతలపూడి సెగ్మెంట్లోనూ సేమ్ టు సేమ్. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా…గ్రూప్ వార్తో ఆ పార్టీ సతమతం అవుతోంది. ఈ పరిస్థితిని వాడుకుంటూ… మనం బలం పెంచుకుంటే… వచ్చే ఎన్నికల్లో సీటు డిమాండ్ చేయవచ్చన్నది గ్లాస్ కార్యకర్తల లెక్క. కానీ… నాయకత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమున్న జిల్లాలో చే జేతులారా ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్నామంటున్నారు జనసేన కార్యకర్తలు. ఆరు సీట్లు గెలిచాం, జిల్లాలో మనకి తిరుగు లేదనుకునే పార్టీ పెద్దలు ఇక్కడి రిజర్వు సీట్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదనేది ఆయా నియోజకవర్గాల నేతల మాట. అధినాయకత్వం కేడర్ మొర వింటుందో లేక ఉన్న బలం చాలని సరిపెట్టుకుంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
తాజావార్తలు
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు.. కేసు నమోదు
-
PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
Suriya 48 : ఎగ్మోర్లో జెట్ స్పీడ్లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!