2020లో కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్, కర్ఫ్యూలు అమలు చేయడంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటికే పరిమితం కావడంతో చాలా వరకు రద్దీ తగ్గిపోయింది. అంతేకాదు, వాహనాలు పరిమిత సంఖ్యలో తిరగడంతో వాతావరణ కాలుష్యంలో అనేక మార్పులు సంభవించాయి. కరోనా కేసులు తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో తిరిగి అన్ని రంగాలు తెరుచుకున్నాయి. కార్మిక ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకోవడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున బొగ్గు తవ్వకాలు, పెట్రోల్ డీజిల్…
భూమిమీద నూకలు ఉంటే మరణం చివరి అంచులదాక వెళ్లినా తిరిగి వెనక్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించవచ్చు. అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో తెలియకుండానే మెరుపుదాడికి బలికావొచ్చు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. బతికినంత కాలం అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సిద్ధంగా ఉండాలి. తృతిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విమానం కూలిపోతే అందులో ఉన్న మనుషులు బతికి బట్టగట్టడం చాలా కష్టం. అదే విమానం రోడ్డుపై కూలిపోయి, అందులో…
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్మెంట్లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. Read: నకిలీ సర్టిఫికెట్లపై…
ఎడారిలో ఎటు చూసినా ఇసుక తప్పించి మరేమి కనిపించదు. ఒయాసిస్సులు ఉన్న చోట మాత్రమే చెట్లు కనిపిస్తాయి. ముళ్ల చెట్లు, నాగజెముడు, బ్రహ్మజెముడు వంటివి మాత్రమే కనిపిస్తుంటాయి. ఎవరూ కూడా కావాలని ఏరికోరి ఎడారి ప్రాంతాలకి పిక్నిక్లకు వెళ్లరు. కానీ, అమెరికాలోని ఫ్రీఫోర్డ్ అనే పట్టణానికి సమీపంలో మైనె డెజర్ట్ అనే ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇది మిని ఎడారి అనుకోవాలి. ఇది సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. అదేంటి ఎడారి అంటే వందల…
కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. మనుషుల మానవత్వాన్ని చంపేస్తేన్నది. అమెరికాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. చిన్నారులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలోని టెక్సాన్ కు చెందిన సారాబీమ్ అనే మహిళ డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రానికి కారును తీసుకొని వచ్చారు. అలా వచ్చిన ఆ మహిళ కారు డిక్కిలో నుంచి మాటలు వినిపిస్తుండటంతో అక్కడ ఉన్న సిబ్బంది…
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు డొనాల్డ్ ట్రంప్.. ఆయన అధ్యక్షుడు అయినా.. ఎప్పుడూ మీడియాపై ఎటాక్ చేస్తూ… సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ.. తన అభిప్రాయాలను పంచుకునేవారు.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. సోషల్ మీడియా డొనాల్డ్ ట్రంప్పై నిషేధం విధించింది.. సోషల్ మీడియాలో ఆయన అన్ని ఖాతాలు, ఆయన ప్రధాన అనుచరుల ఖాతాలు కూడా బ్యాన్కు గురయ్యాయి.. అయితే,…
ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో పడింది. ఇటీవలే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్ను చైనాలో లాంచ్ చేశారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్లోని ఉరుమ్కిలోలో షోరూమ్ను ప్రారంభించారు. ఉరుమ్కిలోలో షోరూమ్ను ప్రారంభిస్తున్నట్టు ఎలన్ మస్క్ విబోలో ప్రకటించాడు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్..…
అమెరికాలో కరోనా వీర విజృంభణ చేస్తున్నది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది డెల్టా వేరియంట్ సమయంలో ఒక్క రోజులో అత్యధికంగా 2 లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆదివారం రోజున యూఎస్లో 5.90 లక్షల కోవిడ్ కేసులు నమోదవ్వగా దానికి డబుల్ స్థాయిలో మిలియన్ కరోనా కేసులు సోమవారం రోజున నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో సుమారు 4 లక్షల కేసులు…
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒమిక్రాన్ రాకతో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది యూఎస్లో అత్యధిక సంఖ్యలో రెండు లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఒక్కరోజులో 4 నుంచి 5 లక్షల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల పెరుగుదల కారణంగా ఆసుపత్రులపై…