Russia: భారత్, ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా నిరోధించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా తీవ్రంగా విమర్శిస్తోంది. ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి సుంకాలు, ఆంక్షలు, నిషేధాల వంటి బలవంతపు చర్యలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు.
యాపిల్ ‘ఐఫోన్’ ప్రేమికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కస్టమ్స్ రూల్స్ 2026లో చేసిన తాజా మార్పులతో ఇప్పుడు అమెరికా నుంచి ఐఫోన్ 17 (iPhone 17)ను భారత్కు తీసుకురావడం మరింత సులభంగా మారింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనలు పెద్ద ఊరట కలిగించనున్నాయి. కొత్త కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీగా తీసుకురాగలిగే వస్తువుల విలువను రూ.75,000 వరకు పెంచారు. గతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల…
Sanjay Raut: డిసెంబర్ 19న దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దేశంలో ‘‘రాజకీయ భూకంపం’’ వస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలనే మరోసారి సంజయ్ రౌత్ చెప్పారు.
Congress: 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం…
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్కి చెందిన మరో యువకుడు అమెరికాలో మృతిచెందాడు.. ఎనిమిది నెలలుగా బోస్టన్ లో ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్.. బోస్టన్ సిటీలో ఈతకొలనులో పడి మృతిచెందాడు..
India US Trade Dispute 2025: భారతదేశానికి చెందిన అల్యూమినియం, ఉక్కు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా టారీఫ్స్ విధించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కింద చర్చలకు రావాలంటూ భారత్ చేసిన అభ్యర్థనకు అగ్రరాజ్యం ఒప్పుకోవడం లేదని లోక్సభలో కేంద్ర వాణిజ్యం- పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు.
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.