Antony Blinken: ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను…
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ లో ముక్కు కడుక్కున్నందుకు ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. కుళాయి నీటిలో ముక్కును శుభ్రం చేసుకున్న సమయంలో నీటిలో ఉన్న అమీబా సదరు వ్యక్తి శరీరంలోకి ప్రవేశించింది. అత్యంత అరుదుగా సోకే ‘‘మెదడును తినే అమీబా’’ నెగ్లిరియా ఫౌలోరి కారణంగా అతను మరణించాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. షార్లెట్ కౌంటీ నివాసి అయిన వ్యక్తి, ఫిబ్రవరి 20 న మరణించాడు.
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం…
అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మెడికల్ ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Russi-Ukraine War: ఉక్రెయిన్పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యాను భారత్, చైనా అడ్డుకుని ఉండవచ్చని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ అణు ఆయుధాలు వాడకుండా భారత్, చైనా దేశాలే నిరోధించి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యాపై ఈ రెండు దేశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపాయని అన్నారు. జీ 20 సమ్మిట్ కోసం భారతదేశానికి వచ్చే కొన్ని రోజులముందు బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Parasites Eat Eye: కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్ర పోతున్నారా..? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. చిన్న పొరపాటు కారణంగా కన్నును కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక వ్యక్తి కాంటాక్ట్ లెన్స్ ను ధరించే నిద్రపోయాడు. అయితే అరుదైన పరాన్నజీవి అతని కంటి మాంసాన్ని తినేసింది. ఫలితంగా అతను కంటి చూపును కోల్పోయాడు.
Tax Survey on BBC:భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ టాక్స్ సర్వే చేపడుతోంది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. ఐటీ పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయాల్లో రైడ్స్ చేస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ధిక్కరించిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ టాక్స్ సర్వేపై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు.