US Intelligence: పాకిస్తాన్ కవ్విస్తే అంతే.. మోదీ హయాంతో భారత్ సైనికంగా స్పందించే అవకాశం..
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో సైన్యం ధీటుగా స్పందించే అవకాశం ఉందని తెలిపింది. భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలుగా ఉన్నందుకు వీటి మధ్య సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. గతంలో భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చిన్న ఘటన అటువైపు నుంచి వచ్చిన ప్రతిస్పందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నివేదిక అంచానా వేసింది.
Read Also: Surprise Gift: సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదేనా.. కళ్లు మూసుకోమని కత్తితో కోసేశాడు
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. కాశ్మీర్ లో హింసాత్మక అశాంతి, భారత్ లో మిలిటెంట్ల దాడులు ఇరు దేశాల మధ్య ప్రమాదాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడింది. అంతర్గత సంఘర్షణ, దేశ అస్థిరత, ఇతర పాలనా సవాళ్లు స్వదేశంలో, విదేశాల్లో అమెరికా ప్రయోజనాలకు, దాని మిత్రదేశాలకు ప్రత్యక్ష, పరోక్ష సవాళ్లు కలిగిస్తాయని తెలిపింది.
మరోవైపు భారత్-చైనాల వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. 2020లో ఇరు దేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో సంబంధాలు దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. ఇది దశాబ్ధకాలంలో అత్యంత తీవ్రంగా ఉందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం పేదరికాన్ని పెంచి, ఆర్థిక వృద్ధికి ఆటకం కలిగించిందని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!