Antony Blinken: ఆటోలో ఆంటోనీ బ్లింకెన్.. ఆటోరిక్షాలో వచ్చి ఆశ్చర్యపరిచిన అమెరికా విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antony Blinken: ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Read Also: Husband Forces Wife: ప్రమోషన్ కోసం బాస్తో పడుకోమన్న భర్త.. ఆ పని చేసిన భార్య
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ సందర్భంగా అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన అమెరికా, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని అమెరికా కాన్సులేట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మా సిబ్బందిని కలవడం ఆనందంగా ఉందని బ్లింకెన్ ట్వీట్ చేశారు. నా పర్యటన భారత్-యూఎస్ భాగస్వామ్య శక్తిని తెలుపుతుందని, ఇండో-పసిఫిక్ ను రక్షించడంలో మా ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఆతిథ్యానికి ధన్యావాదాలు తెలిపారు. భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాల్లో భాగస్వామి కావడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో క్వాడ్ విదేశాంగ మంత్రులు ఇండో-పసిఫిక్లో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఆయన జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా నియంతృత్వ ధోరణి పెరగడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే క్వాడ్ సమావేశాలను గురించి చైనా విదేశాంగ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. దేశాల మధ్య చర్చలు శాంతి, అభివృద్ధికి అనుగుణంగా ఉండాలని చైనా విశ్వసిస్తుందని అన్నారు.
A pleasure to meet with our staff from @USAndIndia, @USAndHyderabad, @USAndKolkata, @USAndChennai, @USAndMumbai, and their families. I’m deeply grateful for their hard work and commitment to strengthen our people to people ties and advance the #USIndia strategic partnership. pic.twitter.com/GXEJUJs8aR
— Secretary Antony Blinken (@SecBlinken) March 3, 2023
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!