G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం పలుదేశాలు ఒత్తడి తీసుకువచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఇందుకు అంగీకరించకపోవడంతో ఏకాభ్రియం కుదరలేదు.
Read Also: Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు
Also Read
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ఇదిలా ఉంటే భారత్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు జీ20 వేదికను పాశ్చాత్య దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించింది. యూఎస్, దాని మిత్రపక్షాల విధ్వంసక విధానాల వల్ల ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందని, వెస్ట్రన్ దేశాల తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని, పేదదేశాల కష్టాలను మరింత తీవ్రం చేసిందని ప్రకటనలో పేర్కొంది.
విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదు. గతేడాది ఇండోనేషియా బాలి వేదికగా జరిగిన సమావేశంలో కూడా వీరిద్దరు మాట్లాడుకోలేదు. ఇక చైనీస్ స్పైబెలూన్ ఘటనపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా మంత్రి క్విన్ గాంగ్ తో కూడా ఆంటోనీ బ్లింకెన్ సమావేశం ఉండకపోవచ్చు. బుధవారం సాయంత్రం నుంచి విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం అయింది. మంగళవారం ప్రధాన చర్చలు జరుగనున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!