USA: క్రూయిజ్ షిప్లో ప్రయాణిస్తున్నవారికి మిస్టరీ వ్యాధి.. 300 మందికి పైగా అనారోగ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
People Fall Sick With Mysterious Illness On A US Cruise Ship: అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఏకంగా 300 మంది అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నారు. మిస్టరీ వ్యాధి బారిన పడినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) నివేదించింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Anurag Thakur : ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు.. విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఓడలో మొత్తం 2,881 మంది ప్రయాణికుల్లో 284 మంది అనారోగ్యం పాలయ్యారు. 1,159 మంది సిబ్బందిలో 34 మంది అంతుచిక్కని అనారోగ్యం బారినపడ్డారు. మంగళవారం నాటికి మొత్తంగా ఓడలోని 13 శాతం మంది వాంతులు, విరేచనాల లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ అనారోగ్యానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదు. ఓడ టెక్సాస్ లోని గాల్వెస్టన్ నౌకాశ్రయానికి చేరుకున్నప్పుడు ఎపిడెమియాలజిస్టులు, పర్యావరణ ఆరోగ్య అధికారులు నౌకను పరిశీలించారు. ఓడలోని వ్యాధి ప్రారంభం అయిప్పటి నుంచి నౌకా సిబ్బంది తరుచుగా శానిటైజేషన్, డిస్ఇన్ఫెక్ట్ మందులను వాడి శుభ్రం చేయడం ప్రారంభించారు. సీడీఎస్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ గతంలో కూడా వార్తల్లో నిలిచింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో 2020లో క్రూయిజ్ షిప్ లో వందలాది మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలోని ఓ ఓడరేవులో దీన్ని నిలిపివేశారు. ఇటీవల కాలంలో సీడీఎస్ క్రూయిజ్ షిప్ లలో కోవిడ్ వ్యాప్తిని పర్యవేక్షించింది.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..