USA: క్రూయిజ్ షిప్లో ప్రయాణిస్తున్నవారికి మిస్టరీ వ్యాధి.. 300 మందికి పైగా అనారోగ్యం..
People Fall Sick With Mysterious Illness On A US Cruise Ship: అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఏకంగా 300 మంది అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నారు. మిస్టరీ వ్యాధి బారిన పడినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) నివేదించింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Anurag Thakur : ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు.. విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
Also Read
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
ఓడలో మొత్తం 2,881 మంది ప్రయాణికుల్లో 284 మంది అనారోగ్యం పాలయ్యారు. 1,159 మంది సిబ్బందిలో 34 మంది అంతుచిక్కని అనారోగ్యం బారినపడ్డారు. మంగళవారం నాటికి మొత్తంగా ఓడలోని 13 శాతం మంది వాంతులు, విరేచనాల లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ అనారోగ్యానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదు. ఓడ టెక్సాస్ లోని గాల్వెస్టన్ నౌకాశ్రయానికి చేరుకున్నప్పుడు ఎపిడెమియాలజిస్టులు, పర్యావరణ ఆరోగ్య అధికారులు నౌకను పరిశీలించారు. ఓడలోని వ్యాధి ప్రారంభం అయిప్పటి నుంచి నౌకా సిబ్బంది తరుచుగా శానిటైజేషన్, డిస్ఇన్ఫెక్ట్ మందులను వాడి శుభ్రం చేయడం ప్రారంభించారు. సీడీఎస్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ గతంలో కూడా వార్తల్లో నిలిచింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో 2020లో క్రూయిజ్ షిప్ లో వందలాది మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలోని ఓ ఓడరేవులో దీన్ని నిలిపివేశారు. ఇటీవల కాలంలో సీడీఎస్ క్రూయిజ్ షిప్ లలో కోవిడ్ వ్యాప్తిని పర్యవేక్షించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!