పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘బద్రి’ సినిమాకి.. ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా చేశారు. ఇదిలావుంటే, వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో…
నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చాలా మంది ప్రముఖులు ఆయన్ను స్మరించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ‘మిస్ యూ మామా’ అంటూ చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. 1996 దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీరి మూడో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, లాక్డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో స్ట్రెయిట్ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తెలియనప్పటికీ, సెకండ్ హీరోయిన్ పేరు మాత్రం చక్కర్లు…
దర్శకుడు గుణశేఖర్.. చారిత్రక, పౌరాణిక చిత్రాలను భారీ సెట్టింగులతో అద్భుతంగా తెరకెక్కించడంతో చాలా అనుభవమున్న దర్శకుడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ముచ్చట్లను పంచుకున్నారు. ‘శాకుంతలం పాత్రలో సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు…
కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన వంతు సాయంపై స్పందించింది. ‘సినిమా వాళ్లు సేవా కార్యక్రమాలు చేయడం లేదనే అపోహను ఆమె తిప్పికొట్టింది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని…
‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ…
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి…
తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ పేజీకి లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సార్ సభ్యుల కత్తెరకు పని ఉండదనే ప్రచారం బాగా జరిగిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఉండదా అంటే ఉంటుంది. రొమాంటిక్…
ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు.…