(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు) ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే…
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తయిందని రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది, లవ్ యూ లింగుస్వామి…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను…
గత కొన్ని రోజులుగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నూరు శాతం వాస్తవం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ప్రకటించారు.”1964లో డా. రామానాయుడుచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్…
‘మా’ ఎన్నికలతో (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పోటీదారులతో రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉంటుందనే వార్తలతో అంత ట్రయాంగిల్ వార్ అనుకున్నారు. అయితే, తాజాగా నటి హేమ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈసారి ‘మా’ బరిలో ఆమె కూడా దిగుతున్నట్లుగా నమ్మదగ్గ సమాచారం. ఇప్పటికే…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందా అని గట్టిగా అడిగితే లేదనే లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇంకా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మన దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో నితిన్ ముందున్నాడు. ‘మాస్ట్రో’ బాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసేశాడు. అలానే రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సైతం చాలా కాలం తర్వాత…
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి.…
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్…
తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా…