ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ముంబయిలో షూటింగ్ లకు అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ కి అనుమతి వున్నా అప్పుడే సాహసం చేయటం లేదు. కాగా ఈ నెల చివర్లో షూటింగ్స్ పునప్రారంభం కానుండగా.. జులై మొదటివారంలో అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్స్ సైతం కరోనా ప్రభావంతో హైదరాబాద్ లోనే సెట్స్…
రాహుల్ రవీంద్రన్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత ‘చిలాసౌ’ సినిమాతో దర్శకుడుగా మారాడు. రెండో సినిమాని కింగ్ నాగార్జునతో ‘మన్మథుడు 2’ సినిమా తీసే అవకాశం వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడట ఈ దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్లాసిక్ ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లుగా పైగా అవుతున్న.. సరైన హిట్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని దాదాపుగా పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అఖిల్-సురేందర్ దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…
ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత నార్త్ లోనూ, సౌత్ లోనూ ఎందరో నటీనటులు తమ వారసులను చిత్రసీమలో ప్రవేశ పెట్టారు. అనేక మంది స్టార్స్ గా విజయం సాధించారు. తమ కన్నవారి పేరు నిలిపారు. అలా జయకేతనం ఎగురవేసిన నటవారసుల్లో నందమూరి బాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. 1974లో ‘తాతమ్మకల’తో…
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనుకుంటాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అందుకే అతని ఖాతాలో ఇప్పటికి కేవలం మూడు సినిమాలే జమనైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం. ఇదిలాఉంటే… ఇప్పటికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్…
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ…
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో థియేటర్ల ఓపెనింగ్ కు మాత్రం మరికొద్ది రోజుల వరకు పర్మిషన్…