టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.…
మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు.…
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును ఆయుర్వేదం ఖాతాలో వేయాలా వద్దా అని ప్రభుత్వ, వైద్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది ఒక కొలిక్కి రాకపోయినా… లక్షలాది మంది ఆ మందు మీద నమ్మకంతో కరోనా బారిని నుండి బయట పడటానికి అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. పర్యవసానం ఎలా ఉన్నా ఆ మందును వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందిగ్థ సమయంలో ప్రముఖ నటుడు జగపతిబాబు మాత్రం ఆనందయ్య పక్షాన నిలిచారు. ఆయన తన…
ఈ రోజు ఉదయం నుండీ చంద్రమోహన్ ఆరోగ్యంపై రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు. అయితే… దానిని తప్పుగా అర్థంచేసుకున్న కొందరు ఆయన ఫోటోలను పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇది చంద్రమోహన్ దృష్టికి సైతం వెళ్ళింది. దాంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల…
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ప్లేబ్యాక్ సింగర్గా అనేక సినిమాలకు పాటలు పాడిన ఆయన తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా వరుస మరణాలతో టాలీవుడ్ లో తీవ్ర…
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా…
కాజల్ అగర్వాల్ పెళ్ళి గత యేడాది అక్టోబర్ 30 గౌతమ్ కిచ్లూతో జరిగిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన వెడ్డింగ్ విషెస్ ను కాజల్ చాలా లైట్ తీసుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. కాజల్ కాంటెంపరరీ హీరోయిన్ అనుష్క! అక్టోబర్ 30న కాజల్ పెళ్లి కాగానే, ఆ విషయం తెలిసి…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో…
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజికల్ వార్ ఎవరి మధ్య అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది దేవిశ్రీప్రసాద్, థమన్ పేర్లే. ఇద్దరూ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ స్టార్ సినిమా ఆరంభిస్తున్నా… మ్యూజిక్ గురించి ముందుగా సంప్రదించేది వీరిద్దరినే. మరి వీరిద్దరూ సినిమాకు ఎంత వసూలు చేస్తారనే విషయం చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు దేవిశ్రీప్రసాద్ నాలుగు కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారని, థమన్ 3…