Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Shave Heads for Cash Reward in Salem: డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది. సినిమాలో లచ్చిమిదేవి డబ్బులు ఇస్తుందని చెప్పి రవితేజ అరగుండు గీయించగా.. ఇక్కడ ప్రభుత్వ పథకం పేరుతో గుండు గీయించుకుంటే నగదు ప్రోత్సాహకం ఇస్తామని నమ్మించి పలువురు మహిళలను బురిడీ కొట్టించాడు ఓ ఆకతాయి. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగుచూసింది.
సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు సోమవారం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను జిల్లా తాలూకా కార్యాలయంలో ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్న అతడు.. కరోనా తరహాలో కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, విదేశాల్లో మహిళలు గుండు గీయించుకోవడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పి భయపెట్టాడు. ఇదే విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని నమ్మబలికాడు. అంతేకాకుండా గుండు గీయించుకున్న ప్రతి మహిళకు రూ.15 వేలు, విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్టాప్ కూడా అందిస్తామని చెప్పాడు. పురుషులకు రూ.6 వేలు ఇస్తారని, సీఎం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. కేవలం 18 మందికే టోకెన్లు కేటాయించామని, ఆ జాబితాలో పళనియమ్మాళ్ పేరు ముందుందని చెప్పడంతో ఆమె ఈ విషయాన్ని నిజమని నమ్మింది.
Also Read
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
వెంటనే పళనియమ్మాళ్ తన చుట్టుపక్కల మహిళలకు ఈ విషయం తెలియజేసింది. ప్రభుత్వం నుంచి నగదు వస్తుందనే ఆశతో పలువురు మహిళలు హడావుడిగా క్షురకుడిని పిలిపించుకుని గుండు గీయించుకోవడం ప్రారంభించారు. మొదటగా కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ఉత్సాహంగా గుండు గీయించుకున్నారు. మరికొందరు కూడా అదే పనికి సిద్ధమయ్యారు. అయితే నగదు ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు పళనియమ్మాళ్ తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. పలుమార్లు ప్రయత్నించినా ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే మిగతా మహిళలకు గుండు గీయించే కార్యక్రమాన్ని నిలిపివేశారు.
అనంతరం ఆరా తీస్తే ఇదంతా ఓ ఆకతాయి చేసిన మోసపూరిత చర్య అని తెలుసుకుని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు లేదా ఇతర సంస్థల పేరుతో ఫోన్ చేసి నగదు, బహుమతులు ఇస్తామని చెప్పే మోసగాళ్ల మాటలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!