దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశానికి తిరుపతి నగరం సిద్ధమయింది. ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడినుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం…
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అండమాన్ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు…
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పైన కొంత పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే తిరుపతి, శ్రీకాలహస్తి కి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేసారు. అక్కడ పాత భవానాల్లో, ఇళ్లలో ఎవరు నివాసం ఉండద్దు అని అధికారులు ప్రజలకు సూచించారు. వెస్ట్,డిఆర్ మహల్ అండర్ బ్రిడ్జ్ల వద్ద వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు అమర్చారు. అయితే ఈ…
అది దేశంలోనే ప్రముఖ హాస్పిటల్. అందులో ఆయన డాక్టర్ కాని డాక్టర్. అర్హత లేకపోయినా ఆ హస్పిటల్ లో ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పుడాయన ఆ హాస్పిటల్ అభివృద్ధి చేయటం కంటే, దాన్ని వెనక్కిలాగడంలోనే ఆయన ముందున్నారట. ఆ ఆస్పత్రికి ఎందుకా పరిస్థితి వచ్చింది? ఆ అధికారి వ్యవహార శైలి ఉంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా బర్డ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. 1985లో పోలియో బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్…
దేశ ప్రజల ముఖాల్లో వెలుగు చూడాలని ఆ జవాన్ తాపత్రయం.. దేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. ఎప్పుడూ దేశ సేవ కోరేవాడని, ఆ క్రమంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సైనికుడిగా చేరి విధులు నిర్వహిస్తుండగానే అసువులు బాశారు ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దావుల కార్తీక్కుమార్రెడ్డి. కార్తీక్ వయసు 29 ఏళ్ళు. గురువారం సాయంత్రం హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం మనాలి సమీపంలో మంచుకొండలు…
దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం, కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం, వెండి నగలు మాయం అయ్యాయి. రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్, డాగ్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. సీసీ టీవీల ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయంలో చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ కె ఫాస్ట్ పుడ్ వద్ద అదుపు తప్పిందో కారు. పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది కారు. ఈ ప్రమాదంతో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నిత్యం రద్దీగా వుండే రహదారిపై కారు బీభత్సంతో పరుగులు తీశారు పాదచారులు. ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి కారుని అక్కడినించి తొలగించారు.
తేజ సజ్జ, ప్రియాంక వారియర్ నటించిన ‘ఇష్క్’ సినిమా చూసే ఉంటారు. ఒంటరిగా కనిపించిన జంటను పోలీసులమని చెప్పి ఇద్దరు బెదిరించి వారి వద్ద డబ్బు గుంజుతారు. అంతేకాకుండా అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడతాడు. సేమ్ ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన జంటలకు పోలీసులు అని చెప్తూ దాడికి పాల్పడుతున్నారు. తిరుపతిలో అర్ధరాత్రి రోడ్లపై ఎవరైనా జంట కనిపిస్తే ఈ ఇద్దరు నిందితులు తాము పోలీసులమని, తమ వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేస్తే…