తిరుపతిలో ఎమ్మెల్యే భూమన సుడిగాలి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు విరిగి రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని రాకపోకలు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు.
టీటీడీ క్వార్టర్స్ సమీపంలో గాలి వానకు విరిగిన చెట్ల కొమ్మలను స్వయంగా లాగారు. ఇష్కాన్ రోడ్డులో గాలి వానకు ఒరిగి పోయిన చెట్లను తొలగించే క్రమంలో స్వయంగా మిషన్ చేతబూని కట్ చేశారు. ఎక్కడికక్కడ నగరంలో విరిగిన చెట్లు, విద్యుత్ పోల్స్ ను జేసీబీల సహాయంతో తొలగించే ఏర్పాట్లను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు.
Also Read
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
- Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
తిరుపతి నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వర్షానికి తోడుగా ఈదురు గాలి కూడా తోడవడంతో నగరంలో సుమారు వంద, వందా పాతిక పైగా చెట్టు నెలకొరిగాయని, కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా విరిగిపడ్డాయని తెలిపారు.
అయితే నగర పాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. విరిగిన చెట్లను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్పటికప్పుడే తొలగించారని, తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించారని తెలిపారు. వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల నవ వధువు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని, దీంతో ఇంత పెద్ద వర్షం పడినా…రెండు సెంటీమీటర్లు కూడా వరద నీరు నిలవడం లేదని భూమన వివరించారు.
- Tags
- ap
- cm jagan
- mla bhoomana
- rains
- Tirupati
తాజావార్తలు
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!