తిరుపతిలో ఎమ్మెల్యే భూమన సుడిగాలి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు విరిగి రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని రాకపోకలు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు.
టీటీడీ క్వార్టర్స్ సమీపంలో గాలి వానకు విరిగిన చెట్ల కొమ్మలను స్వయంగా లాగారు. ఇష్కాన్ రోడ్డులో గాలి వానకు ఒరిగి పోయిన చెట్లను తొలగించే క్రమంలో స్వయంగా మిషన్ చేతబూని కట్ చేశారు. ఎక్కడికక్కడ నగరంలో విరిగిన చెట్లు, విద్యుత్ పోల్స్ ను జేసీబీల సహాయంతో తొలగించే ఏర్పాట్లను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు.
Also Read
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
తిరుపతి నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వర్షానికి తోడుగా ఈదురు గాలి కూడా తోడవడంతో నగరంలో సుమారు వంద, వందా పాతిక పైగా చెట్టు నెలకొరిగాయని, కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా విరిగిపడ్డాయని తెలిపారు.
అయితే నగర పాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. విరిగిన చెట్లను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్పటికప్పుడే తొలగించారని, తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించారని తెలిపారు. వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల నవ వధువు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని, దీంతో ఇంత పెద్ద వర్షం పడినా…రెండు సెంటీమీటర్లు కూడా వరద నీరు నిలవడం లేదని భూమన వివరించారు.
- Tags
- ap
- cm jagan
- mla bhoomana
- rains
- Tirupati
తాజావార్తలు
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
-
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
-
CM Vijay: విజయ్కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
-
Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
-
Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన ‘మగ కచిడి చేప’!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!