తిరుపతిలో ఎమ్మెల్యే భూమన సుడిగాలి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు విరిగి రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని రాకపోకలు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు.
టీటీడీ క్వార్టర్స్ సమీపంలో గాలి వానకు విరిగిన చెట్ల కొమ్మలను స్వయంగా లాగారు. ఇష్కాన్ రోడ్డులో గాలి వానకు ఒరిగి పోయిన చెట్లను తొలగించే క్రమంలో స్వయంగా మిషన్ చేతబూని కట్ చేశారు. ఎక్కడికక్కడ నగరంలో విరిగిన చెట్లు, విద్యుత్ పోల్స్ ను జేసీబీల సహాయంతో తొలగించే ఏర్పాట్లను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
తిరుపతి నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వర్షానికి తోడుగా ఈదురు గాలి కూడా తోడవడంతో నగరంలో సుమారు వంద, వందా పాతిక పైగా చెట్టు నెలకొరిగాయని, కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా విరిగిపడ్డాయని తెలిపారు.
అయితే నగర పాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. విరిగిన చెట్లను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్పటికప్పుడే తొలగించారని, తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించారని తెలిపారు. వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల నవ వధువు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని, దీంతో ఇంత పెద్ద వర్షం పడినా…రెండు సెంటీమీటర్లు కూడా వరద నీరు నిలవడం లేదని భూమన వివరించారు.
- Tags
- ap
- cm jagan
- mla bhoomana
- rains
- Tirupati
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..