ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు.…
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు…
తిరుపతి నగరంలో భారీవర్షాల తర్వాత నిండుకుండలా మారిన రాయలచెరువు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయల చెరువు సమీప గ్రామాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే వున్నారు. అక్కడ క్షణక్షణం ఉత్కంఠ. రాయల చెరువు ప్రాంతంలో జారుతున్న మట్టితో జనం ఊపిరి బిగపట్టి మరీ జీవితం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వుంది జిల్లా యంత్రాంగం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. రాయలచెరువు కట్టపైనే ఎమ్మెల్యే…
తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడారు. రాజకీయలబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని రోజా తెలిపారు. చంద్రబాబు డ్రామాలు ప్రజలు నమ్మరని. చంద్రబాబు హుందాగా వుంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా నూతనంగా రాజధాని బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని రోజా అన్నారు. అయితే తిరుమలలో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన విషయం…
రాయల చెరువు గండిపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. సీఎంకు చెరువు పరిస్దితిని వివరించారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ ఘటన స్దానంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించిన సీఎం… అత్యవసర సమయంలో ప్రజలను కాపాడటానికి రంగంలోకి మూడు హెలికాప్టర్స్ ను దించారు. ప్రజలు ప్రాణాలకు హానీ కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు జగన్. అయితే తిరుపతి, చంద్రగరిని వణికిస్తున్న రాయల్ చెరువు సమీపంలో… మరోసారి వర్షపు చినుకులు పడుతుండటంతో ఆందోళనలో స్దానికులు…అధికారులు ఉన్నారు.…
రాయల చెరువుకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. చెరువుకు ఉత్తర భాగాన వాటర్ లీకేజీతో మరో గండి ఏర్పడింది గండి పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు లీకేజీతో 20 గ్రామాలకు ముప్పు ప్రమాదం ఉంది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 0.6 టీఎంసీల కాగా, ప్రస్తుతం చెరువులో 0.9 టీఎంసీల నీరు ఉంది.నిన్నటి నుంచి దాదాపు 20వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు అధికారులు. దగ్గరుండి ఏర్పాట్లు…
తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి…
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం,…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో…