మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ…
ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఈ నియమాలు వినియోగదారులను.. పెట్టుబడిదారులను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు పన్నులు, బ్యాంకింగ్ ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలు.. సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.
ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి…
పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది.
మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్ఫైనల్కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్లో దీపిక 6-2తో నెదర్లాండ్స్కు చెందిన క్వింటీ రోఫెన్ను ఓడించింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.
వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు.
కేరళలోని వయనాడ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 204కి చేరింది. అలాగే.. 31 మంది తమిళనాడు చెందిన వారు మిస్సింగ్ కాగా.. 1592 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మరోవైపు.. మట్టి కింద మానవ ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే.. ఈ ప్రకృతి విధ్వంసం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తన కళ్లతో చూసిన విషయాలను తెలిపాడు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. మేం ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ…
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా.. భారత ఆటగాళ్లు కొందరు సత్తా చాటుతుంటే.. మరికొందరు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మరి కొందరు ఆటగాళ్లు సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఒలింపిక్స్ రౌండప్ ఎలా ఉందో తెలుసుకుందాం.