Alleti Maheshwar Reddy : భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలి
- కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయని వ్యాఖ్య
- కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల విషయం మీ అంతరాత్మకు తెలుసు అని మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలు ఇక్కడ కాక ఎక్కడ మాట్లాడతారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారు ? అని ఆయన అన్నారు. గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేసారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Also Read
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ టెన్షన్.. టెల్ అవీవ్కి విమానాలు నిలిపేసిన ఎయిర్ ఇండియా..
మరి ఎందుకు CBI కి ఇవ్వడం లేదు అని, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని ఆయన అన్నారు. డిసెంబర్ 23న ధరణి పై కమిటీ వేశారు… అది ఎప్పటి వరకు పూర్తి అవుతుందని, సీఎం గా రెండవ రోజే రేవంత్ ధరణి పై రివ్యూ చేస్తే.. న్యాయం జరుగుతుందని రైతులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ పోర్టల్ ను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? అని ఆయన వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు తగ్గాయని అంటున్నారని, బీఆర్ఎస్ భూభకాసురులు కాజేశారా? ధరణి పోర్టల్ నిర్వహణను NIC కి ఇచ్చే ఆలోచన ఉందా ? ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తారా ? జరిపిస్తే ఎప్పటిలోగా జరిపిస్తారు? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!