మొగల్రాజపురంలో ఆదివారం మెడ్సీ హాస్పిటల్స్ ను మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ ఎండీ శిరీషా రాణివిశిష్ట, పలువురు ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్లో అత్యంత విలువైన ఎడ్టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
మణిపూర్లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్సింగ్ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.
నోయిడా పోలీసులు తన భారతీయ ప్రేమికుడితో కలిసి జీవించడానికి భారతదేశంలోకి చొరబడిన పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను ఆమె గుర్తింపును ధృవీకరించడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పంపారు.
ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్ఫామ్ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.
6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
దేశవ్యాప్తంగా టొమాటో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా ఆదివారం టమాటాలు ఖరీదైనవి అయితే, వాటిని ఇంట్లో పండించండి లేదా వాటిని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు.