Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడివా, నువ్వు దానకర్ణుడివా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచి పెట్టావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు. ఎలా రైతుల నుంచి రాజధాని కోసం లాక్కున్నారంటూ ప్రశ్నించారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆమె ఆరోపించారు. గంజాయి పంట రాష్ట్రంలో బాగా పండుతోందని అంటున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మాజీ మంత్రి గంటా గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు అని స్వయంగా చెప్పారని ఆమె అన్నారు.
Also Read
- Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
Also Read: Andhrapradesh: సీఎం జగన్తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండు సార్లు దొరికారు, జైలుకు కూడా వెళ్ళారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి సాగును ఇనుప పాదంతో అణచి వేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రజారోగ్యం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. “నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 64 కోట్లతో పుత్తూరు అభివృద్ధికి ఖర్చు చేశాను, కోట్లాది రూపాయలు అభివృధి పనులు చేస్తున్నా. నాకు డబ్బులు వచ్చే పనులు నేను చేయను, ప్రజలకు అవసరమైన పనులు, పార్కులు, అభివృద్ధి చేస్తున్నాను. ఎవరిని అడిగి పుత్తూరు మున్సిపాలిటీ చేశారు, దీని వల్ల ప్రజలపై పన్నుల భారం చేసింది టీడీపీనే. గత ప్రభుత్వ హయాంలో స్మశానాన్ని కూడా కబ్జాలు చేశారు. తెలుగు గంగ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి తీసుకు వస్తాం. పుత్తూరు – నగరి మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు అభివృధ్ది చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.” అని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!