Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడివా, నువ్వు దానకర్ణుడివా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచి పెట్టావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు. ఎలా రైతుల నుంచి రాజధాని కోసం లాక్కున్నారంటూ ప్రశ్నించారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆమె ఆరోపించారు. గంజాయి పంట రాష్ట్రంలో బాగా పండుతోందని అంటున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మాజీ మంత్రి గంటా గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు అని స్వయంగా చెప్పారని ఆమె అన్నారు.
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
Also Read: Andhrapradesh: సీఎం జగన్తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండు సార్లు దొరికారు, జైలుకు కూడా వెళ్ళారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి సాగును ఇనుప పాదంతో అణచి వేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రజారోగ్యం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. “నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 64 కోట్లతో పుత్తూరు అభివృద్ధికి ఖర్చు చేశాను, కోట్లాది రూపాయలు అభివృధి పనులు చేస్తున్నా. నాకు డబ్బులు వచ్చే పనులు నేను చేయను, ప్రజలకు అవసరమైన పనులు, పార్కులు, అభివృద్ధి చేస్తున్నాను. ఎవరిని అడిగి పుత్తూరు మున్సిపాలిటీ చేశారు, దీని వల్ల ప్రజలపై పన్నుల భారం చేసింది టీడీపీనే. గత ప్రభుత్వ హయాంలో స్మశానాన్ని కూడా కబ్జాలు చేశారు. తెలుగు గంగ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి తీసుకు వస్తాం. పుత్తూరు – నగరి మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు అభివృధ్ది చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.” అని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!