Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడివా, నువ్వు దానకర్ణుడివా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచి పెట్టావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు. ఎలా రైతుల నుంచి రాజధాని కోసం లాక్కున్నారంటూ ప్రశ్నించారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆమె ఆరోపించారు. గంజాయి పంట రాష్ట్రంలో బాగా పండుతోందని అంటున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మాజీ మంత్రి గంటా గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు అని స్వయంగా చెప్పారని ఆమె అన్నారు.
Also Read
Also Read: Andhrapradesh: సీఎం జగన్తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండు సార్లు దొరికారు, జైలుకు కూడా వెళ్ళారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి సాగును ఇనుప పాదంతో అణచి వేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రజారోగ్యం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. “నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 64 కోట్లతో పుత్తూరు అభివృద్ధికి ఖర్చు చేశాను, కోట్లాది రూపాయలు అభివృధి పనులు చేస్తున్నా. నాకు డబ్బులు వచ్చే పనులు నేను చేయను, ప్రజలకు అవసరమైన పనులు, పార్కులు, అభివృద్ధి చేస్తున్నాను. ఎవరిని అడిగి పుత్తూరు మున్సిపాలిటీ చేశారు, దీని వల్ల ప్రజలపై పన్నుల భారం చేసింది టీడీపీనే. గత ప్రభుత్వ హయాంలో స్మశానాన్ని కూడా కబ్జాలు చేశారు. తెలుగు గంగ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి తీసుకు వస్తాం. పుత్తూరు – నగరి మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు అభివృధ్ది చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.” అని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!