Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడివా, నువ్వు దానకర్ణుడివా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచి పెట్టావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు. ఎలా రైతుల నుంచి రాజధాని కోసం లాక్కున్నారంటూ ప్రశ్నించారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆమె ఆరోపించారు. గంజాయి పంట రాష్ట్రంలో బాగా పండుతోందని అంటున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మాజీ మంత్రి గంటా గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు అని స్వయంగా చెప్పారని ఆమె అన్నారు.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
Also Read: Andhrapradesh: సీఎం జగన్తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండు సార్లు దొరికారు, జైలుకు కూడా వెళ్ళారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి సాగును ఇనుప పాదంతో అణచి వేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏనాడూ ప్రజారోగ్యం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. “నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 64 కోట్లతో పుత్తూరు అభివృద్ధికి ఖర్చు చేశాను, కోట్లాది రూపాయలు అభివృధి పనులు చేస్తున్నా. నాకు డబ్బులు వచ్చే పనులు నేను చేయను, ప్రజలకు అవసరమైన పనులు, పార్కులు, అభివృద్ధి చేస్తున్నాను. ఎవరిని అడిగి పుత్తూరు మున్సిపాలిటీ చేశారు, దీని వల్ల ప్రజలపై పన్నుల భారం చేసింది టీడీపీనే. గత ప్రభుత్వ హయాంలో స్మశానాన్ని కూడా కబ్జాలు చేశారు. తెలుగు గంగ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి తీసుకు వస్తాం. పుత్తూరు – నగరి మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు అభివృధ్ది చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.” అని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!