AP High Court: బిగ్బాస్ షోను సెన్సార్ చేయకపోతే ఎలా?.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP High Court: బిగ్బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది. ఇప్పుడు ఈ షో ప్రసారం కావడం లేదన్న కారణంతో కోర్టు కళ్లు మూసుకుని ఉండలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
Also Read: Heavy Floods: మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
బిగ్బాస్ షో అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండు పిల్స్పై హైకోర్టులో జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ షోను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలని కోరారు. ప్రస్తుతం బిగ్బాస్ షో ప్రసారం కావడం లేదని ప్రతివాది తరఫు లాయర్ వాదించారు. ఈ పిల్స్పై విచారణ సరికాదని.. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్ వేయడానికి పిటిషనర్కు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.
బిగ్బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్షిప్ విధానం లేదనిస్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెట్ మాటీవీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రసారం అయ్యాక అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చని.. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు వ్యవస్థ ఉందన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్షిప్ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని కోర్టు ముందు ప్రస్తావించారు. బిగ్బాస్ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్ మార్చుకోవచ్చని.. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకునే పరిధి తక్కువ అన్నారు.
Also Read: Vanama Venkateshwar Rao: వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు మరోసారి షాక్
వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యంతర ప్రసారాల విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాలని బిగ్బాస్ షో నిర్వాహకులను ఆదేశించింది. కార్యక్రమానికి ముందే సెన్సార్షిప్ లేకపోతే ఎలా? ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనమన్న ధర్మాసనం.. అది పోస్టుమార్టం చేయడమే అవుతుందని పేర్కొంది. ఒకవేళ ప్రతీ ఛానల్ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన యంత్రాంగం లేకపోతే ఎలా.. నైతిక విలువలను కాపాడకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని.. హైకోర్టుకు ఉన్న విచారణాధికార పరిధికి అనుగుణంగా బిగ్బాస్ షో ప్రసారానికి ముందే సెన్సార్ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది. . తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!