వరుస వివాదాలకు కేరాఫ్గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అని చెప్పకనే కరెక్ట్ అంటున్నారు తుంగతుర్తి ప్రజలు. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ... సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఎవరు సంసారి.... ఎవరు సుద్దపూస.... ఎన్నికల్లో…
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ…
తెలంగాణ తాజా రాజకీయం మొత్తం... కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో... ఇప్పుడు పొలిటికల్ హాట్గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కిన విషయం…
సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇప్పుడు అసలు సమస్య. పిలిచి ఎస్ఈ పోస్ట్ ఇస్తామన్నా... ఆసక్తి చూపడం లేదట అధికారులు.
నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారు. గొడవలు జరగకుండా, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సొసైటీకి పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రజా సమస్యలను తీర్చేందుకు.. పోలీస్ సేవలను ప్రజల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు వంగర పోలీసులు. Also Read:Rajnath Singh: ‘‘పాలకు…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని విమర్శించారు. కడియం పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్టేషన్ ఘన్పూర్లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ మీడియా సమావేశంలో…