Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!
- శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి నాకు రెండు కళ్లు
- వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా
- స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
Also Read: Thatikonda Rajaiah: కడియం దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోంది!
Also Read
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… ‘మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాకు రెండు కళ్లు. వారి ఇద్దరి సహాయ సహకారాలతోనే నేను ఇంతటి వాడిని అయ్యాను. ఒక సామాన్య కార్యకర్తను అయిన నేను ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దయతో, ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే, విప్, మంత్రిని అయ్యాను. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చింది, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా. ఎన్నో కష్టాలను ఓర్చుకొని నాకు వెన్నుదన్నుగా ఉన్న ధర్మపురి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..