KCR: రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఓపెన్ కోర్టు విచారణకు ఒప్పుకోకుంటే?
- రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న కేసీఆర్
- కమీషన్ కార్యాలయంలోని కోర్టు హాలుకు అభిమానులు తాకిడి
- ఇన్ కెమెరా విచారణ చేసే యోచనలో కమిషన్
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమీషన్కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఓపెన్ కోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ రాక సందర్భంగా కాళేశ్వరం కమీషన్ కార్యాలయంలోని కోర్టు హాలుకు అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఓపెన్ కోర్టు విచారణకు కేసీఆర్ ఒప్పుకోకుంటే.. ఇన్ కెమెరా విచారణ చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్లే సమయంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
Also Read: MLA Raja SIngh: కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థి.. ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్!
రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావుతో కేసీఆర్ రెండుసార్లు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో నిన్న, ఈరోజు కేసీఆర్, హరీశ్ రావు మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ ఓ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా సిద్దం చేశారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!