Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advocate Swapna Murder: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో సంచలన హత్య జరిగింది. ఆస్తి వివాదమే కారణంగా అడ్వకేట్ స్వప్నను ఆమె సోదరుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వకేట్ స్వప్నకు, ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తోంది. తల్లి తమ 10 ఎకరాల పొలాన్ని ఇద్దరి మధ్య పంచగా.. అందులో 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు రాసి ఇచ్చింది. అయితే స్వప్నకు నాలుగు ఎకరాలు రావడం రాజుకు ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజుపై స్వప్న ఇప్పటికే రెండు సివిల్ కేసులు కూడా వేసింది. అవి ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.
శనివారం ఉదయం స్వప్న తనకు కేటాయించిన నాలుగు ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు వెళ్లింది. అదే భూమిలో ఒక ఎకరం అమ్మేందుకు ఆమె అగ్రిమెంట్ చేసిన విషయం రాజుకు తెలిసింది. దీంతో అక్కడే మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో రాజు కత్తితో స్వప్నపై దాడి చేసి, బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించారు.
ఈ ఘటనపై NTVతో మాట్లాడిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తెలిపారు. రాజు, అతడి డ్రైవర్ గణేష్ సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అడ్వకేట్ స్వప్నకు వివాహం కాలేదని.. అన్ని కోణాల్లో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదం చివరకు ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై నా కూతురును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి వెంకటమ్మ అన్నారు. స్వప్న అన్న రాజు దారుణానికి వడిగట్టాడని.. గత మూడేళ్లుగా స్వప్నని చంపాలని రాజు పథకం పన్నాడని ఆమె అన్నారు. ఇప్పటికే రెండుసార్లు చంపేందుకు ప్రయత్నించాడని, భూమి సర్వే చేసిన తర్వాత తిరిగి వెళుతుండగా రాజు మరో ముగ్గురు వ్యక్తులు నా కూతురుపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. కర్రలతో, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్యకి పాల్పడ్డారని.. రాజుని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!