Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advocate Swapna Murder: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో సంచలన హత్య జరిగింది. ఆస్తి వివాదమే కారణంగా అడ్వకేట్ స్వప్నను ఆమె సోదరుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వకేట్ స్వప్నకు, ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తోంది. తల్లి తమ 10 ఎకరాల పొలాన్ని ఇద్దరి మధ్య పంచగా.. అందులో 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు రాసి ఇచ్చింది. అయితే స్వప్నకు నాలుగు ఎకరాలు రావడం రాజుకు ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజుపై స్వప్న ఇప్పటికే రెండు సివిల్ కేసులు కూడా వేసింది. అవి ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.
శనివారం ఉదయం స్వప్న తనకు కేటాయించిన నాలుగు ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు వెళ్లింది. అదే భూమిలో ఒక ఎకరం అమ్మేందుకు ఆమె అగ్రిమెంట్ చేసిన విషయం రాజుకు తెలిసింది. దీంతో అక్కడే మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో రాజు కత్తితో స్వప్నపై దాడి చేసి, బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించారు.
ఈ ఘటనపై NTVతో మాట్లాడిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తెలిపారు. రాజు, అతడి డ్రైవర్ గణేష్ సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అడ్వకేట్ స్వప్నకు వివాహం కాలేదని.. అన్ని కోణాల్లో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదం చివరకు ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై నా కూతురును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి వెంకటమ్మ అన్నారు. స్వప్న అన్న రాజు దారుణానికి వడిగట్టాడని.. గత మూడేళ్లుగా స్వప్నని చంపాలని రాజు పథకం పన్నాడని ఆమె అన్నారు. ఇప్పటికే రెండుసార్లు చంపేందుకు ప్రయత్నించాడని, భూమి సర్వే చేసిన తర్వాత తిరిగి వెళుతుండగా రాజు మరో ముగ్గురు వ్యక్తులు నా కూతురుపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. కర్రలతో, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్యకి పాల్పడ్డారని.. రాజుని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!