Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Kaleshwaram Project Inquiry Commission And Officers

Off The Record: కాళేశ్వరం కేసులో వారే బలిపశువులు కాబోతున్నారా..?

NTV Telugu Twitter
Published Date :June 10, 2025 , 10:24 pm
By Sudhakar Ravula
  • ఇప్పటికి 113 మందిని ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌..
  • ప్రస్తుతం రాజకీయ నాయకుల పాత్రపై విచారణ..
  • వాంగ్మూలాలు ఇచ్చిన ఈటల, హరీష్‌రావు..
  • బుధవారం హాజరవబోతున్న మాజీ సీఎం కేసీఆర్‌..
  • టెక్నికల్‌ విషయాలతో మాకు సంబంధంలేదని ఇద్దరూ చెప్పారా?..
  • అంతా ఇంజినీరింగ్‌ అధికారులే చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారా?..
  • కేసీఆర్‌ కూడా టెక్నికల్‌గా తెలియదని చెప్పేస్తారా?..
Off The Record: కాళేశ్వరం కేసులో వారే బలిపశువులు కాబోతున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణ తాజా రాజకీయం మొత్తం… కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్‌ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో… ఇప్పుడు పొలిటికల్‌ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్‌ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్‌. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఐతే..ఇప్పుడు విచారణ దాదాపుగా పూర్తవుతున్న టైంలో… రాజకీయ నాయకుల పాత్ర మీద దృష్టి పెట్టింది విచారణ కమిషన్‌. అందులో భాగంగానే… నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌, ఇరిగేషన్‌ మినిస్టర్‌ హరీష్‌రావు ఇప్పటికే విచారణకు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఫైనల్‌గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంతు వచ్చింది. బుధవారం కమిషన్‌ ముందు హాజరవబోతున్నారాయన. ముందు అధికారుల్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళంతా…అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి పేరు చెప్పారట. అందుకే ఆ వాంగ్మూలాలను ఆధారం చేసుకుని రాజకీయ నాయకులకు నోటీసులు పంపి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: Minister Nara Lokesh: అర్థమైందా రాజా..? మంత్రి లోకేష్ కౌంటర్‌ ట్వీట్..

విచారణలో ప్రధానంగా ప్రాజెక్ట్‌ డిజైన్ మార్పు, నీటి నిల్వ, బిల్లుల మంజూరు లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బ్యారేజ్‌లలో నీటిని ఎవరు నిల్వ చేయమన్నారని అంటే…దాంతో మాకేం సంబంధం.. అది ఇంజనీరింగ్ అధికారుల పని అని చెప్పేశారట హరీష్ రావు. అంతకు ముందు ఈటల రాజేందర్ కూడా టెక్నికల్ విషయాల్లో మాకు అవగాహన ఉండదు. ఆ వ్యవహారాలన్నిటిని అధికారులు చూసుకుంటారు కదా అని క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. దీంతో ఇక చివరిగా కేసీఆర్‌ కూడా ఇలాంటి సమాధానాలనే చెబుతుండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన కూడా పరిపాలనా వ్యవహారాలు తప్ప… సాంకేతిక విషయాలతో మాకేం సంబంధం అని అంటే మాత్రం… ఫైనల్‌గా అధికారులే ఇరుక్కుపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఇప్పటివరకు జరిగిన విచారణను నిశితంగా పరిశీలిస్తే… రాజకీయ నాయకులు సేఫ్‌గా తప్పించుకునే పనిలో ఉన్నట్టు అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాంకేతిక కారణాల పేరుతో వాళ్ళు అలా తప్పించుకోగలిగితే… చివరికి బలయ్యేది ఇంజినీర్లు, అధికారులే కదా… అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అదే సమయంలో మరోరకమైన మాటలుకూడా వినిపిస్తున్నాయి.

Read Also: Health Tips: అవసరానికి మించి నడుస్తున్నారా?.. ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!

ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో… అసలు అధికారులు స్వేచ్ఛగా పని చేసుకునే వెసులుబాటు ఉందా..? మంత్రులు…ముఖ్యమంత్రులు ఆదేశిస్తే…. వాళ్ళకు నో అని చెప్పే సాహసం ఆఫీసర్స్ చేయగలుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే సమయంలో కొందరు అధికారులు కూడా… చట్టం అంటే వెరపు లేకుండా…రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారని, తమకున్న పరిజ్ఞానం, వాస్తవాలతో సంబంధం లేకుండా జీ.. హుజూర్‌ అనడానికి అలవాటుపడటం వల్లే… వాళ్ళు ఎక్కువగా ఇరుక్కుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్‌లాంటి విచారణలు వచ్చినప్పుడు అధికారులు చిక్కుకుపోవడాని ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. ఆఫీసర్స్‌ కూడా రూల్స్‌ను ప్రస్తావించి ఆ పేరుతో నాయకులు చెప్పిన పని చేయకుండా ఉంటే… మంచి పోస్టింగ్స్‌ రావని, లూప్‌లైన్‌ నుంచి తప్పించుకుని మెయిన్‌ స్ట్రీమ్‌కు రావాలంటే… పవర్‌లో ఉన్నవాళ్ళు చెప్పినట్టు వినాలని డిసైడ్‌ అవుతున్నారట. ఇలా… రకరకాల కారణాలతో అధికారులు, పాలకుల మధ్య బంధం బలపడి… చివరికి తేడా జరిగితే… ఆఫీసర్సే బలిపశువులు అవుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. అలాగే… మంత్రుల్లో కూడా మౌఖిక ఆదేశాలిచ్చేవాళ్ళే ఎక్కువ. లిఖిత పూర్వక ఆదేశాలిచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని, అలాంటి విషయాల్లో తేడా జరిగితే… ఫైనల్‌గా సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుంటారని, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణను చూస్తుంటే… అధికారులు బలయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయ నాయకులు మాత్రం సేఫ్‌జోన్‌లోనే ఉండవచ్చని అంటున్నారు. ఫైనల్‌గా ఎవరు ఇరుక్కుంటారో, ఎవరి మీద వేటు పడుతుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaleshwaram Inquiry Commission
  • Kaleshwaram project
  • off the record
  • telangana

తాజావార్తలు

  • AP News : దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు కూటమిలో కుంపట్లు పెట్టాయా..?

  • Fake Baba : గుప్త నిధుల పేరిట మోసం.. దొంగ బాబాలు అరెస్ట్‌

  • PM Modi: మోడీ, బెంజమిన్ నెతాన్యహు ఫోన్ సంభాషణ.. ఇరాన్‌ దాడులపై భారత్‌ స్పందన..!

  • TG Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

  • Suruchi Singh: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ ను సాధించిన సురుచీ సింగ్..!

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions