Turkish Airlines: విమానం ఇంజిన్లో మంటలు.. కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్!
- టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు
- ఇంజిన్లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
- కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkish Airlines: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం సిబ్బందితో కలిపి 236 మంది పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు.
Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
Also Read
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన TK 727 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు బయలుదేరింది. విమానం కోల్కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు.
పరిస్థితిని అంచనా వేసిన కోల్కతా ATC.. వెంటనే వారి నుంచి అనుమతి లభించిన వెంటనే విమానాన్ని అత్యంత జాగ్రత్తగా రన్వేపై దింపారు. ముందుగానే అప్రమత్తమైన ఫైర్ బ్రిగేడ్ బృందాలు, అత్యవసర సేవలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులను వరుసగా బయటకు తరలించారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు జరుగుతుండగా.. ప్రయాణికులందరూ విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేదా మరో విషయమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) జనరల్ మేనేజర్ టెక్ నాథ్ సీతౌలా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:28 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం కేవలం నాలుగు నిమిషాల్లోనే కుడి ఇంజిన్లో మంటలు రావడం గమనించారు. ఈ విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజిన్లో మంటల సమాచారం అందిన వెంటనే భద్రతా చర్యలలో భాగంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 15 నిమిషాల పాటు పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!