Turkish Airlines: విమానం ఇంజిన్లో మంటలు.. కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్!
- టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు
- ఇంజిన్లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
- కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkish Airlines: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం సిబ్బందితో కలిపి 236 మంది పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు.
Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన TK 727 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు బయలుదేరింది. విమానం కోల్కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు.
పరిస్థితిని అంచనా వేసిన కోల్కతా ATC.. వెంటనే వారి నుంచి అనుమతి లభించిన వెంటనే విమానాన్ని అత్యంత జాగ్రత్తగా రన్వేపై దింపారు. ముందుగానే అప్రమత్తమైన ఫైర్ బ్రిగేడ్ బృందాలు, అత్యవసర సేవలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులను వరుసగా బయటకు తరలించారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు జరుగుతుండగా.. ప్రయాణికులందరూ విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేదా మరో విషయమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) జనరల్ మేనేజర్ టెక్ నాథ్ సీతౌలా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:28 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం కేవలం నాలుగు నిమిషాల్లోనే కుడి ఇంజిన్లో మంటలు రావడం గమనించారు. ఈ విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజిన్లో మంటల సమాచారం అందిన వెంటనే భద్రతా చర్యలలో భాగంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 15 నిమిషాల పాటు పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!