Turkish Airlines: విమానం ఇంజిన్లో మంటలు.. కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్!
- టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు
- ఇంజిన్లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
- కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkish Airlines: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం సిబ్బందితో కలిపి 236 మంది పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు.
Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
Also Read
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన TK 727 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు బయలుదేరింది. విమానం కోల్కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు.
పరిస్థితిని అంచనా వేసిన కోల్కతా ATC.. వెంటనే వారి నుంచి అనుమతి లభించిన వెంటనే విమానాన్ని అత్యంత జాగ్రత్తగా రన్వేపై దింపారు. ముందుగానే అప్రమత్తమైన ఫైర్ బ్రిగేడ్ బృందాలు, అత్యవసర సేవలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులను వరుసగా బయటకు తరలించారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు జరుగుతుండగా.. ప్రయాణికులందరూ విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేదా మరో విషయమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) జనరల్ మేనేజర్ టెక్ నాథ్ సీతౌలా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:28 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం కేవలం నాలుగు నిమిషాల్లోనే కుడి ఇంజిన్లో మంటలు రావడం గమనించారు. ఈ విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజిన్లో మంటల సమాచారం అందిన వెంటనే భద్రతా చర్యలలో భాగంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 15 నిమిషాల పాటు పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!