Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
- పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు
- రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు
- ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగిందని ఎంపీ లక్ష్మణ్ ప్రశంసించారు.
‘పేద, వెనుకబడిన వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగింది. సబకా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో పాలన సాగించారు ప్రధాని మోడీ. మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్తో ప్రజలకు పాలన అందించారు. అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రభుత్వంలో అండ్ పార్టీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వావలంబన దిశగా పాలన సాగింది. కోవిడ్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు రాజీ లేకుండా ప్రజాక్షేమం, దేశ రక్షణ కోసం పరితపించారు. జపాన్ను అధిగమించి నాలుగవ ఆర్ధిక శక్తిగా ఆవిర్బావం. అతి త్వరలోనే మూడవ ఆర్ధిక శక్తిగా ఆవిర్భవించనున్నాం. శత్రువు గడ్డపై అడుగు పెట్టి, తీవ్రవాదులను తుదముట్టించి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడంలో విజయవంతం అయ్యారు’ అని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ అన్నారు.
Also Read
Also Read: Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!
‘పలు దేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది భారతీయలనే గాకుండా, పలు ఇతర దేశస్థులను కూడా రక్షించి స్వదేశాలకు తరలించడం మరచిపోలేని గొప్ప చర్య. దేశంలో 136 వందే భారత్ రైళ్లను కొత్తగా ప్రారంభించడం ప్రధాని మోడీ సాధించిన ఘన విజయం. 11 కోట్ల మంది రైతులకు 3.7 కోట్ల లక్షల రూపాయల ఆర్దిక తోడ్పాటును అందించడం, దేశంలో 15 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు సదుపాయం, కరోనా సమయంలో 20 కోట్ల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్దిక సహాయం అందించారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వ హయాంలో మాత్రం 12 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు’ అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!